సాధారణంగా సినిమా హీరోయిన్లు పెళ్లయిన వెంటనే పిల్లలు కనేందుకు పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ కన్నా కూడా ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమని నిరూపించుకుంది. బెంగళూరుకు చెందిన డాక్టర్స్ ఫ్యామిలీలో జన్మించిన ప్రణీత.. 2010లో కన్నడ మూవీ పోర్కితో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది, తొలి సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హోదాను అందుకుంది.
అదే ఏడాది ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రణీత.. 2021 మే 30న బిజినెస్ మేన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది.
ఈ దంపతులకు 2022 జూన్ లో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అయితే పాప పుట్టిన రెండేళ్లకే రౌండ్ 2 అంటూ తాజాగా ప్రణీత ఓ గుడ్న్యూస్ ను షేర్ చేసుకుంది. తాను మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ సరిపోవడం లేదు అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ప్రణీత సోషల్ మీడియా ద్వారా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు మరియు నెటిజన్లు ప్రణీతకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.
కాగా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొద్ది నెలలకు ఆన్ స్క్రీన్ కు దూరంగా ఉన్న ప్రణీత.. ఈ ఏడాది ఆరంభంలో తంకమణి అనే మలయాళ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రమణ అవతార అనే కన్నడ మూవీలో మెరిసింది. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్: కథానాయకుడు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఆమె ఒక చిన్న అతిథి పాత్రను పోషించింది.