Moviesబాల‌య్యా ఏంట‌య్యా ఇది.. నీపై ప్రేమ ఇంకా పెరుగుతోంది..!

బాల‌య్యా ఏంట‌య్యా ఇది.. నీపై ప్రేమ ఇంకా పెరుగుతోంది..!

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలు అంటే ప్లాపులు ఎక్కువ ఉండేవి. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి ఇది బాగా మారింది. బాలయ్య క్రేజ్ ఏడాదికేడాదికి పెరుగుతూ వస్తోంది. బాలయ్య సినిమా చేస్తున్నాడు అంటే చాలు సూపర్ హిట్.. ఇటు బుల్లితెరపై కూడా బాలయ్యకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. పైగా ఈ తరం జనరేషన్‌కు బాగా కనెక్ట్ అయిపోయాడు. అప్పట్లో బాలయ్య నిర్మాత ఎవరు..? దర్శకుడు ఎవరు..? అన్నది పట్టించుకునే వారు కాదు. ఎవరికైనా సినిమా చేస్తాను అని మాట ఇస్తే చాలు చేసేవారు. అయితే ఇప్పుడు బాలయ్య చాలా వరకు మారిపోయారు.

సరైన దర్శకుడు అయితే తప్ప ఎస్ అనటం లేదు. పైగా బాలయ్య కుమార్తె తేజస్విని కూడా కథ వింటున్నారు. కథ విని నచ్చితే ఓకే. లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు. ఇక సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చెబుతున్నారు. క్వాలిటీ చెక్ చేస్తున్నారు. వరుసగా బోయపాటి, మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి ఇప్పుడు బాబి తర్వాత మళ్లీ బోయపాటి.. ఇక కొడుకు మోక్షజ్ఞ సినిమా కోసం ప్రశాంత్ వర్మ.. ఇలా మంచి పేరున్న దర్శకులను బాలయ్య ఎంచుకుంటున్నారు. క‌థ ఎంత గొప్పదైనా బాలయ్య కథ విన్న వెంటనే ఓకే చేయటం లేదు. మార్పులు… చేర్పులు కూడా చెప్తున్నారు. ఆ మాటకు వస్తే భగవంత్ కేసరి సినిమా కథలో.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం బాలయ్యే మార్చింది.

ముందుగా అక్కడ అనిల్ రావిపూడి అనుకున్న లైన్ వేరు. ఫ్లాష్ బ్యాక్‌లో కచ్చితంగా పోలీస్ పాత్ర‌ ఉండాలని.. బాలయ్య పట్టుబట్టి క‌థ మార్పించాడు. ఇక తాజాగా తెరకెక్కుతున్న బాలయ్య 109వ సినిమా బాబీ దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా కథ విషయంలోనూ బాలయ్య చాలా మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు షూటింగ్ చేసిన కొన్ని సీన్లు కూడా తీయించేసినట్టు తెలుస్తోంది. వాటికి బదులుగా కొత్త సీన్లు కూడా తీస్తున్నారట. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 ఉంటుంది. ఇప్పటివరకు బాలయ్యకు ఉన్న క్రేజ్ .. ఫాలోయింగ్ తాజాగా బాలయ్య చేస్తున్న మార్పులు, చేర్పులు దెబ్బతో ఇంకా పెరిగిపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news