అనంత అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, సినీ తారలు, రాజకీయ నాయకులు హాజరైయ్యారు. శనివారం రెండో రోజు శుభ ఆశీర్వాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేసి నూతన వధూవరులు రాధికా మర్చంట్ మరియు అనంత్ అంబానీలను ఆశీర్వదించారు.
పలువురు సెలబ్రిటీలు కూడా శుభ ఆశీర్వాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తన పెళ్లి వేడుకలో భాగంగా అనంత్ అంబానీ పలువురు బాలీవుడ్ స్టార్స్ కు ఖరీదైన వాచ్ లు గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు చర్చినీయాంశమైంది. బాలీవుడ్ లో రన్ వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో అనంత్ అంబానీకి మంచి స్నేహబంధం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆయా హీరోలకు తన వెడ్డింగ్ సందర్భంగా అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచ్ లను కానుకగా ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆ వాచ్ల ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్ అనే కంపెనీకి చెందిన వాచ్ లను అనంత్ గిఫ్ట్ చేశారు. ఒక్కో వాచ్ ధర రూ. 2 కోట్లు పైమాటే. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లకు దిమ్మతిరిగిపోతుంది. ఒక్క వాచ్ దొరికినా లైఫ్ సెట్ అయిపోతుందని అభిప్రాయపడుతున్నారు.