Moviesసౌందర్య చావును ముందుగానే ఉహించి చెప్పిన వ్యక్తి.. ఎవరంటే.?

సౌందర్య చావును ముందుగానే ఉహించి చెప్పిన వ్యక్తి.. ఎవరంటే.?

దివంగత నటి సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా.. సౌందర్య ముందే ఈ విషయాన్ని బయట పెట్టాడా..ఇంతకీ సౌందర్య మరణాన్ని ముందుగానే అంచనా వేసిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తమ నటనతోనే మెప్పిస్తారు. అలాంటి వారిలో సావిత్రి తర్వాత సౌందర్య మాత్రమే ఉంటుంది. అయితే ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ ఎవరూ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత జనరేషన్ మొత్తం ఎక్స్పోజింగ్ చేస్తూ ఫేమస్ అయ్యారు.

కానీ వారందరికీ భిన్నంగా సౌందర్య ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే ఎంతోమంది అభిమానులను సంపాదించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చనిపోతుంది అనే విషయం ఓ వ్యక్తికి ముందే తెలుసు.ఇక ఆయన ఎవరో కాదు సౌందర్య కన్న తండ్రి సత్యనారాయణ.. అయితే సత్యనారాయణ జ్యోతిష్యుడు కావడంతో ఆయన చాలామంది జ్యోతిష్యాలు చెబుతూ ఉండేవారు.అలా ఓ రోజు అనుకోకుండా సౌందర్య జాతకం గురించి ప్రస్తావన రాగా నువ్వు మధ్యలోనే చనిపోతావ్ అమ్మా నీకు పూర్తి ఆయుష్షు ఉండదు అని మొహం మీదే చెప్పారట.

ఇక ఆయన మాటలను లైట్ గా తీసుకున్న సౌందర్య అలాంటిదేమీ లేదు నాన్న. నాకు 50 ఏళ్ల వయసు వచ్చేవరకు నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నాను. సినిమాల్లోనే నటిస్తూ ఉంటాను కూడా ఇదే నా కోరిక అంటూ చెప్పిందట. కానీ సౌందర్య జాతకం ప్రకారం ఆమె 2004లోనే మరణిస్తుంది అని ఆమె తండ్రికి ముందుగానే తెలుసు.ఈ విషయం సౌందర్య కి చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు.ఇక సౌందర్య తండ్రి జాతకం చెప్పినట్టు చిన్న వయసులోనే ఆమె విమాన ప్రమాదంలో మరణించింది.అలా సౌందర్య 50 ఏళ్లు వచ్చే వరకు సినిమాల్లో ఉంటానని, అదే నా కోరిక అని చెప్పి చివరికి తన కోరిక తీరకుండానే మరణించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news