Moviesఆ విషయంలో త్రిష-నయన్ లకే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఈమె.....

ఆ విషయంలో త్రిష-నయన్ లకే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఈమె.. ఒక్క దెబ్బతో దూల తీరిపోయిందిగా..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . ఎంతలా అంటే ఒకప్పుడు ఒక హీరోయిన్ కోటి రూపాయలు తీసుకోవాలి అంటేనే అది పెద్ద హాట్ టాపిక్ .. మేకర్స్ కూడా ఒక లేడీ కి అంత డబ్బులు ఆఫర్ చేయడం అనేది చాలా చాలా సంచలమైన విషయం.. ఎవరో చాలా చాలా పెద్ద హీరోయిన్స్ మాత్రమే అలా సినిమాలకు కోటి రూపాయలు ఛార్జ్ చేసేవారు . కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏ హీరోయిన్ కూడా ఇప్పుడు కోటి రూపాయలకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు . మొదటి సినిమా హిట్ అయిందా..? అంతే దాదాపు కోటి రూపాయలు రెండు కోట్ల పైన రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు.

కాగా ఇండస్ట్రీలో ఇప్పటివరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్స్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి త్రిష – నయనతారల పేర్లు మాత్రమే వినిపిస్తాయి . నయనతార ప్రతి సినిమాకి కూడా 10 కోట్లు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట . త్రిష కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అదే స్థాయిలో 6 – 7 -8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తుందట . అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.

నిన్న మొన్నటి వరకు ఐదు కోట్లు ఛార్జ్ చేసిన రష్మిక మందన్నా.. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించే సికిందర్ సినిమా కోసం దాదాపు 15 కోట్లు ఛార్జ్ చేసిందట . ఈ న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో సంచలనంగా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు రష్మిక అభిమానులు . అయితే కొంతమంది మాత్రం ఆమెకి ఫ్యూచర్ పరిస్థితి తెలుసని ఆ కారణంగానే ఇప్పటినుంచే తన సేవింగ్ స్టార్ట్ చేసింది అని పుష్ప 2 సినిమా ఫ్లాప్ అయితే రష్మిక కెరియర్ ఎలా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. అసలు పుష్ప2 సినిమా వాయిదా పడడమే రష్మికకు భారీ బొక్క పెట్టేసింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news