Moviesమళ్లీ అక్కినేని ఫ్యాన్స్ కి మంట రేపుతున్న పాత గాయం.. ఎలా...

మళ్లీ అక్కినేని ఫ్యాన్స్ కి మంట రేపుతున్న పాత గాయం.. ఎలా తట్టుకుంటారో..పాపం..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ చేస్తూ తెగ బాధ పడిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇప్పుడిప్పుడే ఏదో ప్రశాంతంగా ఉన్న అఖిల్ ని మళ్లీ కెలుకుతున్నారే అంటూ ఫీల్ అయిపోతున్నారు. అక్కినేని అభిమానులకు మానిపోతున్న గాయం మీద కారం చల్లినట్లు ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అక్కినేని అఖిల్ లాస్ట్ గా నటించిన సినిమా ఏజెంట్ . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి తుస్సుమంటూ ఫ్లాప్ అయింది .

పెట్టిన దానికి కేవలం పది రూపాయలు కూడా ప్రాఫిట్స్ రాకుండా డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో డిజాస్టర్ టాక్ దక్కించుకుని . అయితే ఈ సినిమా టైంలో అఖిలను ఏ రేంజ్ లో కి ట్రీలింగ్ కి చేశారో మనకు తెలిసిందే. ఏకంగా రంగంలోకి దిగిన అమల సైతం అఖిల్ ఏజెంట్ సినిమా నేను చూశాను బాగుంది అంటూ కొడుకుని ఓ రేంజ్ లో పొగిడేసింది . అయినా సరే ఏమాత్రం కనికరం లేని ఆకతాయిలు ఆయనను పిచ్చ కామిడీగా ఆడేసుకున్నారు .

ఇప్పుడిప్పుడే ఆ ట్రోలింగ్స్ బాధల నుంచి బాధపడి బయటపడుతున్న అక్కినేని ఫ్యామిలీను మళ్ళీ ఆ ట్రోలింగ్కి గురి చేయడానికి సిద్ధమయ్యారు జనాలు. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ మళ్ళీ కన్ఫామ్ చేస్తూ సెప్టెంబర్ 29న సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సింది .. కొన్ని కారణాల చేత ఆలస్యమైంది. అయితే సెప్టెంబర్ 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించడంతో మళ్లీ సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ ని ట్రోల్ చేయడానికి సిద్ధమైపోతున్నారు ఆకతాయిలు . దీంతో అక్కినేని ఫ్యాన్స్ కి మానిపోతున్న గాయంపై కారం చలినట్లయ్యింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news