Movies"ఆ కధ చెప్పితే తంతాడని భయమేసి..ప్రభాస్ కి స్టోరీ చెప్పడమే మానేసిన...

“ఆ కధ చెప్పితే తంతాడని భయమేసి..ప్రభాస్ కి స్టోరీ చెప్పడమే మానేసిన స్టార్ డైరెక్టర్”..ఆ సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు కలిసి నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక. అలాంటి ఓ క్రేజీ కాంబోలోకే వస్తారు ప్రభాస్ – నాగార్జున . ఎస్ చాలామంది జనాలకు ప్రభాస్ నాగార్జున ఓకే సినిమాలో కలిసి నటించి మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కితే చూడాలి అని ఆశ పడుతున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి క్రేజీ కాంబో సెట్ అయింది కాని ..లాస్ట్ మూమెంట్లో ఆ కాంబో వేరే హీరోకి వెళ్లిపోయింది.

ఆ సినిమా మరేదో కాదు “ఊపిరి”. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2016 లో రిలీజ్ అయ్యి కూల్ అండ్ క్లాసిక్ హిట్గా చెరగని రికార్డులను క్రియేట్ చేసుకున్నింది. కలెక్షన్స్ పరంగా పెద్దగా ఆశించినంత స్థాయి రాకపోయినా సరే .. సినిమా టాక్ పరంగా అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటన అందరిని మెప్పించింది . అయితే ఈ సినిమాలో కార్తీ ప్లే చేసిన రోల్లో మొదటగా వంశీ పైడిపల్లి ప్రభాస్ ని అనుకున్నారట.

అయితే అప్పటికే బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ .. ఈ సినిమా అసలు చేస్తారా ..? చేయరా ..? అని ఆలోచించుకోకుండా అసలు ఈ సినిమా ప్రభాస్ చేత చేయిస్తే అభిమానులు కొడతారు అని భయపడి ఆ కథను ఆయనకు చెప్పడమే మానేశారట. ఒకవేళ నిజంగా ఆయన చెప్పిన ప్రభాస్ చేస్తాడని నమ్మకాలు జనాలకి లేవు. తర్వాత ఈ రోల్ కోసం పలువురు హీరోలను అనుకున్నా ఆ తర్వాత ఫైనల్లీ కార్తి సెట్ అయ్యాడు. నిజానికి ఈ రోల్లో కార్తినే బాగా సూట్ అయ్యాడు అన్న కామెంట్స్ కూడా అప్పట్లో వినిపించాయి . అలా వంశీ పైడిపల్లి తనకు తెలియకుండా తాను మంచి నిర్ణయం తీసుకున్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news