Moviesగుంటూరు కారం కోసం ప‌వ‌న్ సాయం… వావ్ మ‌హేష్ + ప‌వ‌న్...

గుంటూరు కారం కోసం ప‌వ‌న్ సాయం… వావ్ మ‌హేష్ + ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. ఇక మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.

ఈ సినిమా క‌థా నేపథ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే పవన్ ఆ నేపథ్యం గురించి చెబుతూ కథలోకి తీసుకువెళ్తే సినిమాకు ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఫీల్ అయ్యాడట. అందుకే గుంటూరు కారం సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో పవన్ జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు ప‌వ‌న్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు.

ఇక ప‌వ‌న్ మ‌హేష్‌బాబు సినిమాకు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం అంటే ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల అభిమానుల‌ను అస్స‌లు ఆప‌లేం. గుంటూరు కారం సినిమాకు ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌పోర్ట్ కూడా ఫుల్‌గా ఉంటుంద‌నే చెప్పాలి. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news