Moviesఆమె ఓ ఐరెన్‌లెగ్‌.. అందుకే సినిమా అట్ట‌ర్‌ప్లాప్… స్టార్ హీరోయిన్‌పై అశ్వ‌నీద‌త్...

ఆమె ఓ ఐరెన్‌లెగ్‌.. అందుకే సినిమా అట్ట‌ర్‌ప్లాప్… స్టార్ హీరోయిన్‌పై అశ్వ‌నీద‌త్ సంచ‌ల‌న కామెంట్స్‌

వైజయంతి మూవీస్ అధినేత, టాలీవుడ్ అగ్ర నిర్మాత చలసాని అశ్వినీ దత్ 50 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్ సినిమాతో ప్రారంభమైన ఆయన వైజయంతి ప్రస్థానం ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 AD సినిమాతో ప్రపంచ ఎల్లలు దాటేస్తుంది. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక హీరోయిన్ పై ఆసక్తికర విషయం బయట పెట్టాడు

చిరంజీవితో ఆయన చూడాలని ఉంది – జగదేకవీరుడు అతిలోకసుందరి – ఇంద్ర లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన జై చిరంజీవ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా భూమిక – సమీరారెడ్డి హీరోయిన్లు నటించారు.

ఈ క్రమంలోనే సమీరా రెడ్డి గురించి అశ్వినీద‌త్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోయిన్ సమీరా రెడ్డి ఐరన్ లెగ్. త్రివిక్రమ్ చెబితేనే ఇందులో ఆమెను హీరోయిన్గా తీసుకున్నాము.. అందులో సన్నివేశాలు అన్ని ఆమెను ఉద్దేశించే రాశాను అని త్రివిక్రమ్ చెప్పారని.. అందులో ఏ ఒక్కటి కూడా బాగాలేదు.. ఎంతో మంచి మంచి సీన్లు ఉన్న ఒక్కదాంట్లో కూడా ఆమె సరిగా నటించలేదు.. సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ అశ్వినీద‌త్‌ సమీరా రెడ్డి పై సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news