ఏఎస్ రవికుమార్ చౌదరి.. టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హిట్లు కొట్టిన డైరెక్టర్. గోపీచంద్ తో యజ్ఞం -సౌఖ్యం లాంటి సినిమాలు, సాయి ధరమ్తేజ్తో పిల్లా నువ్వు లేని జీవితం – బాలకృష్ణతో వీరభద్ర లాంటి సినిమాలు ఆయన తెరకెక్కించారు. గోపీచంద్తో తెరకెక్కించిన సౌఖ్యం సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో 10 ఏళ్లపాటు అడ్రస్ లేని రవికుమార్ తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి అనే సినిమా డైరెక్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో ఆయన హీరో గోపీచంద్ పై పరోక్షంగా కాంట్రవర్సీస్ వ్యాఖ్యలు చేశారు.
గతంలో అందరం చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవాళ్లం ఒకరోజు అతడి కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమను అన్నాడు అని గోపీచంద్ పేరు చెప్పకుండానే పరోక్షంగా విమర్శలు చేశాడు. ఒరేయ్ అంత బలిసిందారా మీకు… గతంలో మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన వచ్చావు ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐదారు గురుని దాటుకుని రావాలా ? వాడిని నేనే హీరోను (యజ్ఞం) చేశాను.. అప్పటివరకు వాడు విలన్ గా (జయం, నిజం,వర్షం) నటించేవాడు.. నా సినిమాతోనే వాడు హీరోగా గుర్తింపు పొందాడు అని గోపీచంద్ పేరు ఎత్తకుండా తిట్టిపోశాడు.
ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే వాడికి తక్కువ.. అలాంటప్పుడు వాడికి ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.. వాడు ఇప్పుడు ఎదురుపడినా ఇలాగే మాట్లాడతాను.. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు నేడు పూర్తిగా మారిపోయాడు.. 2016 సంవత్సరంలో కోటి ఉమెన్స్ కాలేజీలో రారాజు సినిమా షూటింగ్ జరుగుతుంది.. అప్పుడు నేను కూడా అక్కడికి వెళ్లాను.. అప్పటికే బాలకృష్ణతో వీరభద్ర లాంటి ప్లాప్ సినిమా తీశాను… ఈ కారణం తోనే మరో సినిమా తీద్దామని అడిగితే నన్ను దూరం పెట్టాడంటూ గోపీపై విరుచుకు పడ్డాడు.
మంచి కథ చేసి రా చూద్దాం అని అవమానించాడు.. ఇదంతా జరిగిన సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నాడు అంటూ రవికుమార్ చౌదరి కామెంట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో గోపీచంద్ అభిమానులు రవికుమార్ చౌదరిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ మున్నార్ చోప్రాను ముద్దు పెట్టుకుని విమర్శలు ఎదుర్కొంటున్న రవికుమార్ తాజాగా గోపీచంద్ పై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరింత కాంట్రవర్సీ అయ్యాడు.