టాలీవుడ్లో ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన సినిమా కుబేర. ధనుష్, కింగ్ నాగార్జున కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సాలిడ్ సినిమా కుబేర. రష్మిక మందన్న హీరోయిన్. ఆసియన్ సునీల్ నిర్మించిన ఈ సినిమా రు. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మంచి బజ్ సెట్ చేసుకుని ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి దిగింది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన కుబేర వరల్డ్ వైడ్ గా మంచి టార్గెట్ తోనే దిగినట్లు తెలుస్తోంది.ఓవర్సీస్ సహా అన్ని భాషల్లో కలుపుకొని కుబేర 60 కోట్లకి పైగా బిజినెస్ చేసిందట. ఇక ఇందులో సగం బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని జరిగినట్టు టాక్. ఇంట్రెస్టింగ్ గా తమిళ్ లోనే తక్కువ బిజినెస్ జరిగిందంటున్నారు. ఓవరాల్గా కుబేర ఈ మొత్తాన్ని రీచ్ అవ్వాలంటే 120కోట్లకి పైగా రాబట్టాల్సి ఉంది.ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేసి ఈ బాక్సాఫీస్ టార్గెట్ను చేధిస్తుందో ? చూడాలి.
‘ కుబేర ‘ వరల్డ్ వైడ్ టార్గెట్ లెక్క ఇదే… ఎన్ని కోట్లో తెలుసా… !
