టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఖలేజా’ సినిమాను తాజాగా రీ – రిలీజ్ చేశారు. ఈ సినిమా 15 ఏళ్ల క్రితం వచ్చి డిజాస్టర్ అయినా కూడా ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఇక ఈ సినిమాను ఎందుకు ప్లాప్ చేశామా ? అని ఇప్పటకీ బాధపడే అభిమానులు చాలా మందే ఉన్నారు. అయితే వీరు రీ రిలీజ్లో మాత్రం ఖలేజాను సూపర్ బ్లాక్ బస్టర్ చేసి పడేశారు.ఖలేజా రీ-రిలీజ్ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఖలేజా రీ-రిలీజ్లో తొలి రోజున వరల్డ్వైడ్గా ఏకంగా రూ.8.26 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. అసలు ఇది అలాంటి ఇలాంటి సంచలనం కాదు. ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ రేంజ్లో వసూళ్లు రావడంతో ఈ సినిమా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసినట్లైంది. వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు.
రీ రిలీజ్లో ‘ ఖలేజా ‘ విధ్వంసం.. వరల్డ్ వైడ్ డే 1 మైండ్ బ్లాకింగ్ వసూళ్లు…!
