టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఖలేజా. వీరి కాంబినేషన్లో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు వచ్చాయి. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన ఖలేజా సినిమా ఇన్నేళ్లకు రీ రిలీజ్ అయ్యింది. భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనకాపల్లి నుంచి అమెరికా వరకు విధ్వంసం క్రియేట్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతోంది.ఈ క్రమంలోనే మహేష్ బాబుకి ఎంతో స్ట్రాంగ్ జోన్ అయ్యిన యూఎస్ మార్కెట్ లో అయితే లెక్కలు ఊహించని నంబర్లతో బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. యూఎస్లో ఏకంగా 80 వేల డాలర్లకు పైగా వసూళ్లు అందుకుని ఆల్ టైం రికార్డ్స్ వేట మొదలెట్టేసింది. ఏదేమైనా రీ రిలీజ్లోనూ ఖలేజా ఓ సంచలనంగా మారనుంది. మణిశర్మ సంగీతం అందించగా సి కళ్యాణ్, సింగనమల రమేష్ బాబులు నిర్మాణం వహించారు.
యూఎస్ మార్కెట్లో ‘ ఖలేజా ‘ విధ్వంసం… 15 ఏళ్ల ప్లాప్ సినిమాకు ఏ మాత్రం తగ్గని క్రేజ్…!
