టాలీవుడ్లో ఈ ఏడాదిలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన భారీ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఈ సమ్మర్లో రిలీజ్ కావాల్సి ఉంది. అసలు ఎప్పుడో మొదలైన ఈ రెండు సినిమాలపై సరైన క్లారిటీ లేక చిరు, ప్రభాస్ అభిమానులే బిగ్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. విశ్వంభర టీజర్ ఎప్పుడో వచ్చింది. అందులో విజువల్స్ చూసి మెగాఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు.ఇక సినిమా సంక్రాంతి అన్నారు… సమ్మర్ అన్నారు.. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. రాజాసాబ్ నుంచి టీజర్ కూడా లేదు. ఏ అప్డేట్ రావడం లేదు. మరోవైపు వీటితో డిలే అవుతూ వచ్చిన పవన్ హరిహర వీరమల్లు సినిమా ఫుల్ స్వింగ్లో ఉంది. అయితే విశ్వంభర, రాజా సాబ్ సినిమాలపై రిలీజ్ క్లారిటీ ఫ్యాన్స్ కోరుకుంటున్నా సస్పెన్స్గా ఉంచుతున్నారు. అందుకే ఈ సినిమాపై పెద్ద హైప్ కూడా లేకుండా పోయింది. చిరు, ప్రభాస్ అయినా కాస్త చొరవ తీసుకుంటేనే ఈ సినిమాకు హైప్ వస్తుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
చిరంజీవి – ప్రభాస్ ఈ మౌనం ఎందుకు… ఇలా చేస్తున్నారేంటి..?
