నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 – తాండవం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 తర్వాత బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య మరో ఆఫర్ ఇచ్చారు. ఇక గోపీచంద్ ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్తో తెరకెక్కించిన జాట్ కూడా మంచి హిట్ అయ్యింది.దీంతో గోపీచంద్ వెంటనే బాలయ్య సినిమా కోసం పనులు స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే తన స్టోరీ బ్యాంకులో ఉన్న స్టోరీనే బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసి బాలయ్యకు కథ వినిపించగా.. బాలయ్య చిన్న చిన్న మార్పులతో గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్ ? ఈ సినిమా ప్రారంభోత్సవానికి జూన్ 8 ముహూర్తంగా పెట్టారని అంటున్నారు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్దం చేస్తున్నారుట.
బాలయ్య కొత్త సినిమాకు ముహూర్తం పెట్టేశారు… ఆ హిట్ డైరెక్టర్తోనే…!
