Moviesఅజిత్ ' ప‌ట్టుద‌ల ' ఏపీ - తెలంగాణ డిస్ట్రిబ్యూష‌న్ ఎవ‌రంటే..!

అజిత్ ‘ ప‌ట్టుద‌ల ‘ ఏపీ – తెలంగాణ డిస్ట్రిబ్యూష‌న్ ఎవ‌రంటే..!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ విదాముయార్చి ’ . ఇప్పటికే కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాలిడ్ బజ్‌ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అజిత్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. అభిమానులు ఫుల్ ధీమాతో ఉన్నారు. ఇక ఈ సినిమాను కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు మ‌గిజ్ తిరుమేని డైరెక్ట్ చేశారు. ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ సినిమా వాయిదాలు ప‌డి ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతోంది.డైరెక్టర్స్ కు కండిషన్స్ పెడుతున్న అజిత్…ఇక ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు. ప‌ట్టుద‌ల సినిమాను ఏపీ, తెలంగాణలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఇక సీడెడ్ ప్రాంతంలో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.Trisha does not believe in divorce | cinejosh.com

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు ట్రీట్ అందించడం ఖాయమని సినిమా యూనిట్ ధీమాతో ఉంది. ప‌ట్టుద‌ల సినిమాలో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

Latest news