నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇదిలా ఉంటే అఖండ సినిమా నుంచి బాలయ్య వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. డాకు మహారాజ్ సినిమాకు గాను.. బాలయ్యకు రూ.28 కోట్ల రెమ్యనరేషన్ ఇచ్చినట్టు టాక్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమాకు బాలయ్యకు నిర్మాతలు రెమ్యూనరేషన్ గా రూ.35 కోట్లు ఇస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ఈ పెరిగిన రెమ్యూనరేషన్ నుంచి బాలయ్య థమన్కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని కూడా.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య సాధారణంగా సినిమాకు తన రెమ్యునరేషన్ పెంచేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు. అయితే ఇటీవల కాలంలో బాలయ్య సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్లు అవుతూ ఉండడంతో పాటు.. భారీగా వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ పెరుగుతూ వస్తోంది. బాలయ్య ఒక్కసారిగా అఖండ 2 సినిమాకు రూ.7 కోట్లు రెమ్యునరేషన్ పెంచేసాడంటూ వస్తున్న వార్తలలో ఎంత మాత్రం నిజం లేదు.
వాస్తవానికి నిర్మాతలే బాలయ్య సినిమాలకు పెరుగుతున్న కలెక్షన్లు.. పెరిగిన బాలయ్య మార్కెట్ నేపథ్యంలో.. ఏడు కోట్లు అదనంగా రెమ్యునరేషన్ పెంచి అఖండ 2 సినిమాకు రూ.35 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అఖండ సినిమా నిర్మించిన సాహూ గారపాటి.. వీర సింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీస్ వాళ్ళు, డాకు మహారాజు నిర్మించిన సితార నాగ వంశీ కూడా బాలయ్య అడగకుండానే రెమ్యునరేషన్ పెంచి ఇచ్చారు. ఇప్పుడు అఖండ 2 విషయంలోనూ అదే జరిగింది.