టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ వివాహం జరిగి గురువారానికి 45 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్య సురేఖకు చిరు ప్రత్యేకంగా పెళ్లి రోజు విషెస్ చెప్పారు. ఈ వార్షికోత్సవాన్ని ఈ జంట విమాన ప్రయాణంలో సరదాగా జరుపుకోవడం విశేషం. తాజాగా వారు దుబాయ్కి ప్రయాణిస్తున్న విమానంలో తమ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకున్నారు.ఈ వేడుకలో చిరంజీవి, సురేఖకి వారి సన్నిహితులు బొకేలు అందించి మరీ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకలో సినీ స్టార్స్ కూడా పాల్గొన్నారు. చిరు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన వారిలో అక్కినేని నాగార్జున, అమల, నమ్రత ఘట్టమనేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక తన జీవితానికి వెలుగు తీసుకు వచ్చిన తన భార్య తన వెనకాలే ఎప్పుడూ ఉంటూ ఎంతో బలం, ధైర్యం ఇచ్చిందని.. ఆమె తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చిరు తెలిపారు.
ఈ క్రమంలోనే చిరు ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా, మెగా అభిమానులు.. తెలుగు సినీ లవర్స్ సైతం వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విమానంలో చిరు – సురేఖ పెళ్లి వేడుక… నాగ్ – నమ్రత ఏం చేశారంటే..!
