గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘ గేమ్ ఛేంజర్ ’ . ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు ? క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తితో ఉన్నారు. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సినిమా కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.ముఖ్యంగా యూఎస్లో ‘ గేమ్ ఛేంజర్ ’ సినిమా పై బజ్ పీక్స్లో ఉంది. ఇప్పటికే డల్లాస్ నగరంలో ‘ గేమ్ ఛేంజర్ ’ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో అక్కడి ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఉన్నారో తెలుస్తోంది. అయితే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ను గ్రాండ్గా వేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యింది. ప్రీ సేల్స్లో గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రిలీజ్కు మరో 15 రోజుల సమయం ఉండటంతో ఈ టికెట్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దర్శకుడు శంకర్ ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్గా రూపొందిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా… గేమ్ ఛేంజర్ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరుల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
యూఎస్ ప్రీమియర్ సేల్స్లో గేమ్ ఛేంజర్ దూకుడు… వారెవ్వా చరణ్..!
