Moviesస‌లార్ 2 ' లో మ‌రో సూప‌ర్‌స్టార్ … ఫ్యీజులు దొబ్బాల్సిందే…!

స‌లార్ 2 ‘ లో మ‌రో సూప‌ర్‌స్టార్ … ఫ్యీజులు దొబ్బాల్సిందే…!

టాలీవుడ్ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్, కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్ళు కొల్లగొట్టింది. ప్రభాస్‌కు వ‌రుస ప్లాప్‌ సినిమాల తర్వాత సలార్ రూపంలో అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు స‌లార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్త గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరు స్క్రీన్ పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని కూడా అంటున్నారు. కాగా ఈ సీక్వెల్లో నటిస్తున్న హీరోయిన్ శృతిహాసన్, సీనియర్ హీరో జగపతిబాబు, బాబీసింహ, పృధ్విరాజ్‌ సుకుమారన్, శ్రియ రెడ్డి ఇప్పటికే తిరిగి సెట్స్ పైకి రానున్నారు. ఇక పార్ట్ 2 సినిమాకు సౌర్యాంగ‌ పర్వం అనే టైటిల్ ఖరారుచేశారు.

కొద్ది రోజుల క్రితం సలార్ 2 సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా పార్ట్ 2 త్వరలో పూర్తి చేసి 2025లో రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ఈ ఏడాది ఇప్పటికే నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాతో అదిరిపోయే పాన్ ఇండియా హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్ల భారీ వ‌సూళ్ళు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇక కల్కి సినిమాకు కూడా సీక్వెల్ ఉంది. సలార్ 2 షూటింగ్ పూర్తి అయిన వెంటనే కల్కి 2 సెట్స్ మీదకు వెళుతుంది. స‌లార్ పార్ట్-2 సినిమా గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ లా ఉండనుందని నిర్మాత ఇప్ప‌టికే తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news