Moviesప్రభాస్‌కి చుక్కలు చూపించి రాక్షసానందం పొందిన హీరోయిన్.. ఎవరంటే..?

ప్రభాస్‌కి చుక్కలు చూపించి రాక్షసానందం పొందిన హీరోయిన్.. ఎవరంటే..?

ప్రభాస్‌కి చుక్కలు చూపించి రాక్షసానందం పొందిన హీరోయిన్.. ఎవరంటే..?
ప్రభాస్.. ప్రస్తుతం ఈయన రేంజ్ ఏంటో చెప్పనక్కర్లేదు. బాహుబలి రెండు సిరీస్ లతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ తన అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఇసుమంతయినా తగ్గలేదు.ఈయన విదేశాలకు ఎక్కడికి వెళ్లినా కూడా ఎంతోమంది వీరాభిమానులు ఈయనతో సెల్ఫీలు దిగడానికి,ఆటోగ్రాఫర్లు తీసుకోవడానికి ఎగబడతారు అంటే ఈయన రేంజ్ ఎలాంటిదో చెప్పుకోవచ్చు.రాజుల వంశానికి చెందిన ఈయన అన్నింట్లో రాజు లాగే వ్యవహరిస్తారు. అయితే అలాంటి ప్రభాస్ ని ఓ హీరయిన్ ముప్పు తిప్పలు పెట్టి మూడుచెర్ల నీళ్లు తాగించిందట. అంతేకాదు ఆ హీరోయిన్ తో ప్రస్తుతం ప్రభాస్ కి సఖ్యత లేదు అనే టాక్ కూడా వినిపించింది.

ఇక ప్రభాస్ కి చుక్కలు చూపించిన హీరోయిన్ అనగానే టాలీవుడ్ లో అందరికీ వినిపించేది ఒకే ఒక్క పేరు ఆమెనే పూజ హెగ్డే.. ప్రభాస్ పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్క మూవీ రాధే శ్యామ్.. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ 2022లో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది.ఈ సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డేలు నటించారు. అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో పూజ హెగ్డే కి ఐరన్ లేగ్ ట్యాగ్ వచ్చింది. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ సినిమాలో పూజ హెగ్డే తో ప్రభాస్ కొన్ని సన్నివేశాల్లో కరెక్ట్ గా చేయలేకపోయారట. దానికి ప్రధాన కారణం పూజ హెగ్డే హెడ్ వెయిట్ అని తెలుస్తుంది.

ఆమె సినిమా షూటింగ్ కి వచ్చాక గంటల గంటలు కేరవాన్ లో కూర్చుని చిత్ర యూనిట్ అందరిని ఇబ్బంది పెట్టేదని కొంతమంది సినీ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా ఓ రోజు షూటింగ్ కి డేట్స్ ఇచ్చి వస్తానని చెప్పి తీరా టైం కి రాకుండా తప్పించుకొని ఆ రోజు మొత్తం ప్రభాస్ ని వెయిట్ చేయించిందనే టాక్ కూడా వినిపించింది. అలా రెండు మూడు సంఘటనల కారణంగా ప్రభాస్ కి పూజ హెగ్డే కి మధ్య మాటలు లేవనే టాక్ వినిపించింది. అలాగే వీరి కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా పూజ హెగ్డే చాలా పొగరుగా ప్రవర్తించి సరిగ్గా చేయలేదట.అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందనే టాక్ కూడా అప్పట్లో సినీ ఇండస్ట్రీ లోని కొంతమంది మాట్లాడుకున్నారు.

అయితే ఇదే విషయం గురించి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో ప్రభాస్ ని పూజ హెగ్డే ని అడిగితే అలాంటిదేమీ లేదు అంటూ బుకాయించారు.అలాగే చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలను ఖండించినప్పటికీ నిజంగానే వీరి మధ్య గొడవ జరిగింది అనే టాక్ మాత్రం గట్టిగా వినిపించింది.అలా పూజ హెగ్డే, ప్రభాస్ కి పట్ట పగలే చుక్కలు చూపించిందనే టాక్ అప్పట్లో చాలా గట్టిగా వినిపించడంతో ప్రభాస్ అభిమానులు అందరూ పూజ హెగ్డే పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు పూజ వల్లే రాధే శ్యామ్ మూవీ ఫ్లాప్ అయిందని ప్రచారం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news