Moviesసింహాద్రి హీరోయిన్ అంకిత ఏమైపోయింది.. ఆమె భ‌ర్తను ఎప్పుడైనా చూశారా..?

సింహాద్రి హీరోయిన్ అంకిత ఏమైపోయింది.. ఆమె భ‌ర్తను ఎప్పుడైనా చూశారా..?

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి మూవీ ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా యాక్ట్ చేసిన అంకిత గుర్తుందా..? ఆకట్టుకునే అందం, అలరించే అభినయం తో అంకిత అప్ప‌ట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సింహాద్రిలో చీమ చీమ చీమ పాటకు ఎన్టీఆర్ తో పోటి ప‌డి స్టెప్పులు వేసింది.

కానీ ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది. అస‌లు అంకిత ఏమైపోయింది..? ఇప్పుడెక్క‌డ ఉంది..? అంకిత భ‌ర్త ఎవ‌రు..? వంటి ఇంట్రెస్టింగ్ విష‌య‌ల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అంకిత పూర్తి పేరు అంకిత ఝవేరి. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ‌.. రస్నా ప్ర‌క‌ట‌న ద్వారా పాపుల‌ర్ అయింది. 2002లో లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో హీరోయిన్ గా త‌న సినీ ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అంకిత‌కు సింహ్రాది భారీ బ్రేక్ ఇచ్చింది.

ఈ సినిమా అందించిన విజ‌యంతో అంకిత ద‌శ తిరుగుతుంద‌ని.. ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. సింహాద్రి త‌ర్వాత‌ అందరు దొంగలే దొరికితే, విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు, రారాజు, ఖతర్నాక్ త‌దిత‌ర చిత్రాల్లో అంకిత న‌టించింది. ఇవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ అంకిత అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఆయా భాష‌ల్లో సైతం అంకిత స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది.

అవ‌కాశాలు కూడా త‌గ్గిపోవ‌డంతో అంకిత 2010 నుంచి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది. 2016లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వివాహం అనంత‌రం అంకిత త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. అక్క‌డ అర ఎకరం స్థలంలో అందమైన ఇంటిని నిర్మించుకుంది. అంకిత‌కు ఇద్ద‌రు కుమారులు కూడా జ‌న్మించారు. ఇక అంకిత భ‌ర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంక్ లో వ‌ర్క్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news