Moviesఈ ఒక్క తప్పుతో శ్రీ లీల కెరీర్ నాశనం అయినట్టేనా..?

ఈ ఒక్క తప్పుతో శ్రీ లీల కెరీర్ నాశనం అయినట్టేనా..?

శ్రీ లీల వరుస‌ పెట్టి తెలుగులో సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలు, కుర్ర హీరోలు అందరితోను జోడి కడుతోంది. అయితే సరైన హిట్ మాత్రం రావడం లేదు. మహేష్ బాబు, రామ్, వైష్ణవ తేజ్, నితిన్ ఇలా అందరి హీరోలతో నటిస్తున్నా.. ఎందుకో గాని ఆమెకు స‌క్సెస్‌ లేదు. బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమా చేసి హిట్టు కొట్టింది. ఆ సినిమా తర్వాత అయినా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే ఈ టైంలో ఆమె ఓ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పింది. బాలీవుడ్ లో ఆఫర్ వస్తే ఎగిరి గంతేసే రోజులు ఎప్పుడో పోయాయి. సౌత్‌లో కాస్త క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్ కైనా.. హిందీ నుంచి పిలుపు వస్తుంది. రష్మిక‌ కూడా అలాగే బాలీవుడ్ వెళ్లి యానిమల్ లాంటి సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టింది.

అయితే శ్రీలల మాత్రం ఈ విషయంలో తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు మంచి అవకాశం అయితే వచ్చింది. అయితే అది తన కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుంది.. అన్నది ఆమెకే తెలియాలి. సిద్ధార్థ మల్హోత్రా ప్రస్తుతం మిత్తి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ‌లీలను తీసుకున్నారు. అసలు ఈ సినిమా శ్రీ‌లీల ఎందుకు ఒప్పుకుంది..? అన్నదే ఎవరికి అర్థం కావడం లేదు. సిద్ధార్థ కు అస్సలు స్టార్డం లేదు. ఈ సినిమా దర్శకుడు ఎవరో..? కూడా ఎవరికీ తెలియదు. అయితే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో శ్రీ‌లీల ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు.

శ్రీ‌లీల కు టాలీవుడ్ లో రోజులు బాగా లేవు. వరుస ఫ్లాపులు. మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం తర్వాత ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఆమెకు సరైన అవకాశాలు కూడా వస్తాయా..? రావా..? అన్నట్టుగా ఉంది. అయినా కూడా అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత ఆమెకు ఓ మంచి ఆఫర్ ఇస్తున్నట్టు ఇటీవల ఓపెన్ గా ప్రకటించారు. ఇలాంటి ఆఫర్లను వాడుకుని ఇక్కడ ఒకటి, రెండు హిట్లు కొడితే ఆమెకు తెలుగులో తిరుగే ఉండదు. అయితే ఇక్కడ క్రేజీ ఉండగానే.. ఆమె బాలీవుడ్ లో సినిమా ఒప్పుకుని రెండు పడవల మీద‌ ప్రయాణం చేయటం సరికాదు. ఇలియానాతో మొదలు పెడితే ఎంతోమంది ఇలా రెండు పడవలపై కాళ్లు వేసి ప్రయాణం చేసి ఎటూ కాకుండా పోయారు. మరి శ్రీలీల ఈ విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఆమెకే తెలియాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news