Moviesబాల‌య్య త‌న‌యుడు డెబ్యూ మూవీపై రెండు బ్లాక్బ‌స్ట‌ర్ అప్‌డేట్లు ఇవే.. నంద‌మూరోళ్ల‌ను...

బాల‌య్య త‌న‌యుడు డెబ్యూ మూవీపై రెండు బ్లాక్బ‌స్ట‌ర్ అప్‌డేట్లు ఇవే.. నంద‌మూరోళ్ల‌ను ఆప‌లేం..?

టాలీవుడ్ సీనియర్ హీరో నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఐదారు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నా అవేవీ కార్యరూపం దాల్చడం లేదు. అయితే ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హనుమాన్ ద‌ర్శ‌కుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడి సినిమా ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందా ? అని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఓ అదిరిపోయే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలకృష్ణ ఏ పని చేయాలన్నా మంచి రోజులు ముహూర్తాలు.. శుభ ఘడియలు చూసుకుంటారు అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడి తెరంగ్రేటానికి కూడా మంచి ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆషాడం వెళ్లిపోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అలాగే బాలయ్య తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం హైదరాబాదులో ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అందరు బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు.

అదేరోజు బాలయ్య తన గోల్డెన్ జూబ్లీ వేడుకలలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ జోడిగా నటించే హీరోయిన్ గురించి కూడా ఓ క్రేజీ రోమర్ వైరల్ అవుతుంది. దివంగత శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్‌ను ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేస్తారని అంటున్నారు. ఇప్పటికే నందమూరి హీరో ఎన్టీఆర్ దేవర సినిమాతో శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జాన్వీకపూర్ చెల్లి ఖుషీ కపూర్ మోక్షుకు జోడిగా నటించనుందని వార్త టాలీవుడ్ లో అందరిని ఆకర్షిస్తోంది. ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ – ఖుషి కపూర్ కాంబినేషన్ అంటేనే వినటానికి క్రేజీ ప్రాజెక్టుగా ఉంది.. రేపు ఇది నిజంగా పట్టాలు ఎక్కితే నందమూరి అభిమానులకు అంతకుమించిన ఆనందం ఏముంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news