Moviesపొగరుతో స్టార్ హీరోకే చుక్కలు చూపించిన శ్రీదేవి..?

పొగరుతో స్టార్ హీరోకే చుక్కలు చూపించిన శ్రీదేవి..?

దివంగత నటి శ్రీదేవి టాలీవుడ్ ద్వారా స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా రాణించింది.అలా సౌత్ లో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్లో స్థిరపడి పోయింది. అక్కడే బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే అలాంటి శ్రీదేవి ఓ స్టార్ హీరో సినిమాల విషయంలో చాలా పొగరుగా వ్యవహరించేదట. ఆమె పొగరుకి దర్శక నిర్మాతలు కూడా షాకయ్యేవారట. మరి ఇంతకీ శ్రీదేవి ఏ హీరో దగ్గర పొగరు చూపించింది.. ఎందుకు అలా ప్రవర్తించింది అనేది ఇప్పుడు చూద్దాం.

శ్రీదేవి అవమానించింది ఎవరినో కాదు మెగాస్టార్ చిరంజీవిని.ఆమె చిరంజీవి సినిమాల్లో పొగరు చూపించడంతో చాలా మూవీస్ లో అవకాశాలు కోల్పోయిందట.అలా మొదట వీరిద్దరి కాంబినేషన్లో కొండవీటి దొంగ అనే సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారు. ఇక సినిమా స్టోరీ మొత్తం విన్న శ్రీదేవి ఈ సినిమాలో కొండవీటి దొంగ టైటిల్ తీసేసి కొండవీటి రాణి అని పెట్టాలని డిమాండ్ చేసిందట.అంతే కాకుండా చిరంజీవి కంటే ఈ సినిమాలో తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని, అలా అయితేనే సినిమాలో నటిస్తానని కండిషన్ పెట్టిందట.

దాంతో ఈమె కండిషన్లకు ఒప్పుకోని దర్శక నిర్మాతలు ఏ సినిమాలో అయినా హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ముందుగా తెలుసుకోమని ఆమెను తీసేసి ఆమె ప్లేస్ లో హీరోయిన్ రాధని తీసుకున్నారు.ఇక ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వజ్రాల దొంగ సినిమా కూడా మిస్ అయింది. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సమయంలో కూడా మొదట టైటిల్ జగదేకవీరుడు అని అనుకున్నారట రాఘవేంద్ర రావు.

కానీ ఈ సినిమా కథ విన్నాక కూడా శ్రీదేవి అతిలోకసుందరి పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక జగదేకవీరుడు అతిలోకసుందరి అనే టైటిల్ పెట్టారట.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.ఇక చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో మోసగాడు, జగదేకవీరుడు అతిలోకసుందరి,ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలు వచ్చాయి. అలా శ్రీదేవి తన పొగరుతో స్టార్ హీరో చిరంజీవికి చుక్కలు చూపించిందని అప్పట్లో టాక్ వినిపించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news