Moviesప‌బ్లిక్ గా నిహారిక ఇమేజ్ డ్యామేజ్ చేసిన నాగ‌బాబు.. ఫైర్ అవుతున్న...

ప‌బ్లిక్ గా నిహారిక ఇమేజ్ డ్యామేజ్ చేసిన నాగ‌బాబు.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్ లో కమిటీ కుర్రోళ్లు అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. య‌దు వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, సాయి కుమార్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై నీహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించ‌గా.. అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.

ఆగ‌స్టు 9న క‌మిటీ కుర్రోళ్లు విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో గ‌త రెండు వారాల నుంచి నిహారిక ఈ చిత్రాన్ని గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తోంది. హైద‌రాబాద్ లో సోమ‌వారం కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్‌, సాయి దుర్గ తేజ్ స్పెష‌ల్ గెస్ట్‌లుగా వ‌చ్చారు. అలాగే యంగ్ స్టార్ అడివి శేష్ కూడా అతిథిగా వ‌చ్చి సంద‌డి చేశారు.

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ‌బాబు త‌న కూతురు నిహారిక అల్ల‌రి గురించి మాట్లాడి ప‌బ్లిక్ గా ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశారు. నిహారిక నా స్వీటెస్ట్ డాటర్. తను కొంచెం పెద్దయ్యాక ఇండిపెండెంట్‌గా పడుకోమని చెప్పేవాడిని. కానీ తన మదర్ కిచెన్‌లోకి వెళ్లగానే వచ్చి నా బెడ్‌ ఎక్కేసి నా షర్ట్‌లో దూరి బాగా అల్లరి చేసేది` అంటూ నాగబాబు త‌న కూతురి చిలిపి చేష్టలు గురించి చెప్పుకొచ్చారు. అయితే అంద‌రి ముందు అలాంటి విష‌యాలు రివీల్ చేయ‌డంలో నిహారిక చాలా షేమింగ్ గా ఫీలైంది. ఇక నెటిజ‌న్లు కూడా నాగ‌బాబుకు ఎక్కడేం మాట్లాడాడో తెలియ‌దంటూ ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటువంటి విష‌యాలు ఎవ‌రైనా చెబుతారా? అంటూ నాగ‌బాబుకు చుర‌క‌లు వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news