Moviesలైగ‌ర్ బాకీలు.. డ‌బుల్ ఇస్మార్ట్‌కు క‌ష్టాలు.. ఏసియ‌న్ సునీల్ కామెంట్లు..?

లైగ‌ర్ బాకీలు.. డ‌బుల్ ఇస్మార్ట్‌కు క‌ష్టాలు.. ఏసియ‌న్ సునీల్ కామెంట్లు..?

ఏ ముహూర్తాన పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా చేశాడో ? గానీ ఆ సినిమా పూరిని చాలా వరకు దెబ్బ కొట్టింది.. సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు ఉన్న బయ్యర్లు.. ఎగ్జిబిటర్లు అందరూ ఘోరంగా నష్టపోయారు. ఈ సినిమాను నైజాంలో పంపిణీ చేసిన వరంగల్ శీను లాంటి డిస్ట్రిబ్యూటర్లు అయితే అసలు అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు పూరి జగన్నాథ్ – ఛార్మి కలిసి రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు పోటీగా డబ్బులు ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే లైగ‌ర్ బాకీలు డబుల్‌ ఇస్మార్ట్ రిలీజ్ ను ఇబ్బందులు పెడుతున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే లైగ‌ర్ సినిమా బాకీలు ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ తీరుస్తారని దానికి బదులుగా పూరి జగన్నాథ్ ఆయనకు ఓ సినిమా చేయడానికి మధ్య అంగీకారం కుదిరింది అంటూ రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఏషియన్ సునీల్ పూర్తిగా ఖండించారు. తనకు అసలు అలాంటి ఆలోచన లేదని.. తాను పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని అనుకుంటే అది డైరెక్ట్ గానే చేస్తాను.. అంతే తప్ప లైగ‌ర్ బాకీలతో తనకు సంబంధం లేదని సునీల్ ఖండించారని సమాచారం. తాను పూరితో సినిమా చేయాల‌ని ఎప్పటినుంచో అనుకుంటున్న మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు చేయట్లేదు అని కూడా సునీల్ చెప్పేశారు.

ఇదిలా ఉంటే ఛాంబర్లో లైగ‌ర్ కారణంగా నైజాంలో.. విశాఖలో తలెత్తిన థియేటర్ల సమస్య గురించి కూడా సమావేశాలు మొదలైనట్టు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ తరఫున హీరో రామ్ బంధువు నిర్మాత స్రవంతి రవి కిషోర్ రంగంలోకి దిగారు. పూరి – ఛార్మి తరపున ఆయన ఛాంబర్ లో వ‌క‌ల్తా పుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే పరిస్థితులు మరీ అంత సానుకూలంగా లేవని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా లైగర్ సినిమా డిజాస్టర్ అనేది రామ్ – పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ ను కష్టాల్లోకి నెట్టింది అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news