Moviesశివాజీ - ల‌య ఈ అనుబంధం మీకు తెలుసా….!

శివాజీ – ల‌య ఈ అనుబంధం మీకు తెలుసా….!

తెలుగు సినిమా పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం హీరో శివాజీకి మంచి పాపులారిటీ ఉంది. శివాజీ ఇప్పటికీ అడపాదడపా అటు వెండి తెర మీద.. ఇటు బుల్లితెర మీద కనిపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే శివాజీ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ షో తో బుల్లితెర ప్రేక్షకుల మనసు కూడా శివాజీ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ ఫైనల్ వరకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 90 స్‌ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ తర్వాత శివాజీ క్రేజ్‌ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయి అయిన లయ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.

విజయవాడకు చెందిన లయ కొన్ని తెలుగు సినిమాలలో నటించి మంచి క్రేజీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. అమెరికాలో సెటిల్ అయిన లయ తిరిగి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శివాజీ – లయ మధ్య ప్రత్యేకమైన స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. మిస్సమ్మ – అదిరిందయ్యా చంద్రం – టాటా బిర్లా మధ్యలో లైలా – బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే నాలుగు సినిమాలు వచ్చాయి.

ఈ నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్లు కొట్టాయి. అలా తెలుగు సినీ పరిశ్రమంలో వీరిద్దరి కాంబినేషన్కు మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. దీనిని ఈటీవీ విన్ సంస్థ నిర్మించబోతుంది. ఏది ఏమైనా శివాజీ – లయ కాంబినేషన్ అంటేనే ఒక క్రేజీ ఉంటుంది. మళ్ళీ ఈ నెలకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుండడంతో తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు శివాజీ – లయ అభిమానులలో మంచి క్రేజీ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news