Moviesడ‌బుల్ ఇస్మార్ట్ ' నుంచి ఆ సీన్లు మొత్తం తీసేశారా…. సెకండ్...

డ‌బుల్ ఇస్మార్ట్ ‘ నుంచి ఆ సీన్లు మొత్తం తీసేశారా…. సెకండ్ డేకే ఫ్యాన్స్‌కు షాక్..?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా – కావ్య థాపర్ హీరోయిన్గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఎక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్‌ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ లో డీసెంట్ బజ్‌తో రిలీజ్ అయింది. ఆగస్టు 15 కానుకగా అటు రవితేజ – హరీస్‌ శంకర్ మిస్టర్ బచ్చన్ – విక్రమ్ తంగలాన్ – నార్ని నితిన్ ఆయ్‌ సినిమాలకు పోటీగా వచ్చింది.

అయితే డబుల్ స్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ తరహాలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోలేదు. పైగా కొన్ని సీన్లు బోరింగ్ గా ఉన్నాయన్న కంప్లైంట్స్ కూడా ఆడియన్స్ నుంచి ఉన్నాయి. ఈ సీన్స్ లో మెయిన్ గా ఆలీ ట్రాక్ అయితే ఇప్పుడు మేకర్స్ బాగా ట్రిమ్ చేసినట్టుగా తెలుస్తోంది. సినిమా ఫస్ట్ ఆఫ్ నుంచి సెకండాఫ్ వరకు కొన్ని సీన్లు అయితే మేకర్స్ ఇప్పుడు ట్రిమ్ చేసి… సినిమాని అప్డేట్ చేశారట.

అయితే వాస్త‌వానికి ఆలీ ట్రాక్ ప‌ర‌మ బోరింగ్‌గా ఉంద‌ని ముందే చ‌ర్చ న‌డిచింది. ఇప్పుడు తొలి రోజు ప్రేక్ష‌కుల నుంచి దీనిపై ఎక్కువ కంప్లైంట్లు రావ‌డంతో మేక‌ర్స్ తొలి రోజు షోలు పూర్త‌య్యాక ట్రిమ్ చేసి కొత్త వెర్ష‌న్‌ను అప్‌డేట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక తొలి రోజు డ‌బుల్ ఇస్మార్ట్ వర‌ల్డ్ వైడ్‌గా రు. 12.5 కోట్ల గ్రాస్‌.. రు. 7 కోట్ల పై చిలుకు షేర్ రాబ‌ట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news