Moviesబాల‌కృష్ణ‌-రామ్ కాంబోలో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ గా మ‌హేష్ బాబు ఫిక్స్‌..!?

బాల‌కృష్ణ‌-రామ్ కాంబోలో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ గా మ‌హేష్ బాబు ఫిక్స్‌..!?

తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు హీరోలు క‌లిసి ఒక‌ సినిమాలో నటిస్తే.. ఒక టికెట్ పై రెండు సినిమాలు చూసినంత కిక్ ప్రేక్షకులకు వస్తుంది. పైగా మల్టీస్టారర్ చిత్రాలకు సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అందుకే క‌థ న‌చ్చితే అటువంటి చిత్రాలు చేయ‌డానికి అగ్ర‌హీరోలు ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌రు. ఇకపోతే తెలుగులో త్వ‌ర‌లోనే ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోందని ప్ర‌స్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి.

నటసింహం నందమూరి బాలకృష్ణ, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో ఆ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని అంటున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోయే ఈ మ‌ల్టీస్టార‌ర్ కు యువ ద‌ర్శ‌కుడు మ‌హేష్ బాబు.పి డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మ‌హేష్ బాబు గ‌త ఏడాది మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి మూవీతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. న‌వీన్ పోలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ సూప‌ర్ హిట్ కావ‌డంతో.. మ‌హేష్ బాబుకు మంచి పేరు వ‌చ్చింది. అయితే ఇప్పుడు మ‌హేష్ బాబు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను బాల‌కృష్ణ‌-రామ్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ గా ప్లాన్ చేసుకున్నాడ‌ట. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌స్తుంద‌ని అంటున్నారు.

కాగా, రామ్ ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ మూవీతో బిజీగా ఉన్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన ఈ చిత్రం ఆగ‌స్టు 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక మ‌రోవైపు బాల‌కృష్ణ త‌న 109వ చిత్రాన్ని కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నాడు. ఎన్‌బీకే 109 వ‌ర్కింగ్ టైటిల్ తో గ‌త ఏడాదే ప‌ట్టాలెక్కిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news