Moviesఛార్మీ వ‌ల్ల పూరి జ‌గ‌న్నాథ్‌కు దూర‌మైన క్రేజీ హీరోయిన్ ఎవ‌రు.. ఏం...

ఛార్మీ వ‌ల్ల పూరి జ‌గ‌న్నాథ్‌కు దూర‌మైన క్రేజీ హీరోయిన్ ఎవ‌రు.. ఏం జ‌రిగింది..?

టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు పూరి జగన్నాథ్. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నా.. పూరి జగన్నాథ్ అదే జోష్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఏ సినిమా చేసినా హీరోలకి అదిరిపోయే మాస్ ఇమేజ్ క్రియేట్ చేసి పెడతాడు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ పూరి సినిమాలలో నటిస్తే వాళ్లకు మంచి గుర్తింపు ఉంటుంది. పూరి కథ రాసుకున్నప్పుడే హీరోను దృష్టిలో పెట్టుకుంటాడు. అలాగే హీరోయిన్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉండేలా చూస్తాడు. అందువల్లే కొందరు హీరోయిన్లు పూరి సినిమాలలో నటించి టాలీవుడ్‌లో ఎక్కువ సంవత్సరాలు కొనసాగారు. అనుష్కలాంటి హీరోయిన్ సైతం పూరి ద్వారానే పరిచయం అయింది.

ఇక పూరి సినిమాలలో ఐటెం సాంగ్‌లు కూడా ఎలా పాపులర్ ? అవుతాయో తెలిసిందే. ఐటమ్ సాంగ్‌లో కనిపించిన అమ్మాయిలు చాలా క్రేజ్ తెచ్చుకుంటారు. అలా బాగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో నౌరా ఫ‌తేహి, మమైత్ ఖాన్ ఉంటారు. పూరి ఆస్తులని పోగొట్టుకొని ఢీలా పడిన సమయంలో తన తమ్ముడు సాయిరాంను హీరోగా పరిచయం చేస్తూ 143 సినిమా చేశాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా పాప్ సింగర్ కం డ్యాన్సర్ అయిన ముమైత్ ఖాన్ టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ పాటలో మమైత్ తన డ్రెస్సులని తొడలపై వరకు వేసుకొని అందాలు చిందిస్తూ ఒక రేంజ్‌లో పాపులర్ అయింది.

అందుకే పూరి.. ముమైత్‌కు పోకిరి సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా అవకాశం ఇచ్చాడు. అలా వీళ్ళిద్దరి స్నేహం చాలా ఏళ్లపాటు కలిసి కొనసాగింది. పూరి భార్య లావణ్య అయితే ఒక్కోసారి ముద్దలు కలిపి ముమైత్‌ నోట్లో పెట్టేదట. అంత క్లోజ్ గా ఉండేవారు. అయితే పూరి జీవితంలోకి హీరోయిన్ ఛార్మి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుంచి ముమైత్ ఖాన్, పూరి మధ్య గ్యాప్ పెరిగిందట‌.. అలా వాళ్ళిద్దరు విడిపోయారట. మ‌మైత్ విడిపోయాక చాన్నాళ్ళ నుంచి ఛార్మి, పూరితో అలా కలిసి జర్నీ చేస్తోంది. చివరకు వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు కూడా తీస్తున్నారు. ముమైత్ ఖాన్ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది పాపం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news