Newsచిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు మెగా హీరోల‌తోనూ రొమాన్స్ చేసిన...

చిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు మెగా హీరోల‌తోనూ రొమాన్స్ చేసిన ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రు..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైగా మెగా హీరోలతో జత కడితే హీరోయిన్ల దశ తిరగడం ఖాయమనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఉంది‌. అందుకే హీరోయిన్లు మెగా హీరోల సినిమాల్లో ఛాన్సుల కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇకపోతే మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాప్ స్టార్స్ గా సత్తా చాటుతున్నారు.

అయితే ఈ ముగ్గురు మెగా హీరోలతోనూ రొమాన్స్ చేసిన లక్కీ హీరోయిన్లు కొంద‌రు ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ అందాల చందమామ రామ్ చరణ్ తో కలిసి మగధీర మూవీలో నటించింది. రాజమౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ త‌ర్వాత నాయక్, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాల్లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే మరోవైపు చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో జతకట్టిన కాజల్.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసింది.

మ‌ల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాస‌న్ కూడా చిరు, ప‌వ‌న్‌, చ‌ర‌ణ్‌ల‌తో సినిమాలు చేసింది. ఎవ‌డు మూవీలో రామ్ చ‌ర‌ణ్ తో శృతి హాస‌న్ స్క్రీన్ షేర్ చేసుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి గబ్బ‌ర్ సింగ్‌, కాటమరాయుడు, వ‌కీల్ సాబ్ చిత్రాలు చేసింది. గ‌త ఏడాది వాల్తేరు వీర‌య్య చిత్రంలో చిరంజీవితో క‌లిసి ఆడిపాడింది. అయితే మెగా హీరోల‌తో శృతి హాస‌న్ చేసిన సినిమాల‌న్నీ హిట్ అవ్వ‌డం మ‌రొక విశేషం.

ఇక‌పోతే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా ముగ్గురు మెగా హీరోల‌తో రొమాన్స్ చేసింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడిగా న‌టించిన త‌మ‌న్నా.. రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ర‌చ్చ సినిమా చేసింది. చిరంజీవి, త‌మన్నా కాంబినేష‌న్ లో సైరా, భోళా శంక‌ర్ వంటి చిత్రాలు వ‌చ్చాయి. అయితే మెగా హీరోల‌కు త‌మ‌న్నా హిట్లు క‌న్నా ఫ్లాపులే ఎక్కువ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news