Newsఅల్లు అర్జున్‌, సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో మిస్ అయిన బ్లాక్...

అల్లు అర్జున్‌, సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏది..?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. తోటి హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే సాయి పల్లవి మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ప్రాధాన్యత ఉన్నా పాత్రల వెనక పరిగెట్టింది. మేకప్ లేకుండా కెమెరా ముందు నటించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. లేడీ పవర్ స్టార్ గా కోట్లాది ప్రేక్షకుల‌ను తన అభిమానులుగా మార్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది.

ఇకపోతే సాయి పల్లవి చేత ఒక ప్రాజెక్ట్ పై సంతకం చేయించడం అంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే సాయి పల్లవి సినిమాల ఎంపిక‌లో ఎంతో కేర్ తీసుకుంటుంది. ముఖ్యంగా త‌న‌ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యతతో పాటు ఎటువంటి అశ్లీలత అసభ్యత లేకుండా చూసుకుంటుంది. ఇందుకు విరుద్ధంగా పాత్రలు వస్తే ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. బడా బ్యానర్ అయినా రిజెక్ట్ చేసేస్తుంది. ఇలా సాయి పల్లవి గతంలో చాలా చిత్రాలను వదులుకుంది

అయితే అందులో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉందని మీకు తెలుసా..? ఇంతకీ అల్లు అర్జున్, సాయి పల్లవి కాంబినేషన్‌లో మిస్ అయిన ఆ సినిమా మ‌రేదో కాదు పుష్ప‌. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. పుష్ప ది రైస్ టైటిల్ తో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ విడుదలైంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇప్పుడు పుష్ప 2 కూడా విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది.

అయితే పుష్ప‌లో హీరోయిన్ శ్రీ‌వ‌ల్లి క్యారెక్టర్ కోసం మొదట సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించారట. కానీ సాయి పల్లవి రిజెక్ట్ చేసింది. స్టోరీ న‌చ్చిన‌ప్ప‌టికీ.. ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లు ఉంటాయి. అదేవిధంగా హీరోయిన్ ప‌లు స‌న్నివేశాల్లో ఎక్స్పోజింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కార‌ణంగానే సాయి ప‌ల్ల‌వి పుష్ప మూవీని వ‌దులుకుంది. దాంతో ఆమె స్థానంలో రష్మిక మంద‌న్నాను ఎంపిక చేశారు. ఇక‌ శ్రీవల్లి పాత్రలో రష్మిక ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news