Moviesథాయ్‌లాండ్‌లో వైభ‌వంగా వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. వైర‌ల్ గా మారిన ఫోటోలు..!

థాయ్‌లాండ్‌లో వైభ‌వంగా వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. వైర‌ల్ గా మారిన ఫోటోలు..!

విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఫైనల్ గా ఓ ఇంటిది అయిపోయింది. తన ప్రియ‌స‌ఖుడు, ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఏడ‌డుగులు వేసింది. వీరు ముందు రిసెప్ష‌న్‌.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. జూలై 4న చెన్నైలోని తాజ్‌ హోటల్ లో వరలక్ష్మి శరత్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ రిసెప్షన్ జ‌ర‌గ‌గా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజర‌య్యారు.

తమిళనాడు సీఎం స్టాలిన్, నందమూరి బాలకృష్ణ, విక్ట‌రీ వెంకటేశ్, సూప‌ర్ స్టార్‌ రజినీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన, ర‌మ్య‌కృష్ణ‌, సుదీప్‌, మంచి లక్ష్మి, సందీప్ కిషన్ వంటి ఎంద‌రో సెల‌బ్రిటీలు వ‌ర‌ల‌క్ష్మి, నికోలాయ్ రిసెప్ష‌న్ వేడుక‌లో సంద‌డి చేశారు. ఇక జూలై 10 మంగళవారం నాడు థాయ్‌లాండ్‌లోని క్రాబి బీచ్‌ రిసార్ట్‌లో వ‌ర‌ల‌క్ష్మి, నికోలాయ్ మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు.

తమిళ సంప్రదాయానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల న‌డుమ వ‌ర‌ల‌క్ష్మి, నికోలాయ్ జంట‌ అత్యంత వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ మ‌రియు నెటిజ‌న్స్ వ‌ర‌ల‌క్ష్మి-నికోలాయ్ దంప‌తుల‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

పెళ్లి దుస్తుల్లో వ‌ర‌ల‌క్ష్మి చాలా అందంగా ఉంటుంద‌ని కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, వ‌ర‌ల‌క్ష్మి మ‌రియు నికోలాయ్ మ‌ధ్య 14 ఏళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. వీరి ప‌రిచయం ప్రేమ‌గా మార‌డంతో పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వ‌ర‌ల‌క్ష్మికి ఇది మొద‌టి వివాహం కాగా.. నికోలాయ్ కు మాత్రం రెండొవ‌ది. అత‌ను గ‌తంలో ఒక మోడ‌ల్ ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. మొద‌టి భార్య త‌ద్వారా ప్ర‌స్తుతం నికోలాయ్ కు 15 ఏళ్ల కూతురు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news