Moviesబిగ్ బాస్ సీజ‌న్ 8లోకి ముగ్గురు క్రేజీ హీరోయిన్స్‌.. ఇక ఆడియ‌న్స్...

బిగ్ బాస్ సీజ‌న్ 8లోకి ముగ్గురు క్రేజీ హీరోయిన్స్‌.. ఇక ఆడియ‌న్స్ కి పండ‌గే!

తెలుగు బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలో సీజన్ 8 కూడా ప్రారంభం కాబోతోంది. ఇటీవ‌ల బిగ్ బాస్ సీజన్ 8 లోగోను రివీల్‌ చేస్తూ మేక‌ర్స్ ప్రోమోను రిలీజ్ చేశారు. మరిన్ని హంగులు మరింత ఎంటర్టైన్మెంట్ తో లేటెస్ట్ సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురి సెల‌బ్రిటీల పేర్లు ఎప్పటిలాగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా కంటెస్టెంట్స్‌ లిస్టులో ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో రీచా పల్లాడ్ ఒక‌రు. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2000 సంవత్సరంలో నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రంలో తరుణ్ కు జోడిగా నటించి ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది. 2016 తర్వాత వెండితెరకు దూరమైంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రిచా పాల్గొనబోతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

అలాగే సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన హీరోయిన్ అంకిత, నాగార్జున యొక్క సూపర్ హిట్ మూవీ బాస్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన పూనమ్ బజ్వా సీజన్ 8 లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆ హీరోయిన్లతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారట. ఇక నిజంగా రిచా, అంకిత‌, పూన‌మ్‌ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే ఆడియ‌న్స్ కి కన్నుల పండుగే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news