Moviesఆ హీరోయిన్ మీద ప్రేమతో రంభకి అన్యాయం చేసిన హీరో…!

ఆ హీరోయిన్ మీద ప్రేమతో రంభకి అన్యాయం చేసిన హీరో…!

ఒకప్పుడు తెలుగు, తమిళ,మలయాళ,కన్నడ, హిందీ,భోజ్ పూరి భాషల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది నటి రంభ.. రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత చిరంజీవి,బాలకృష్ణ వెంకటేష్, జే.డి. చక్రవర్తి, మోహన్ బాబు వంటి ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఆ ఒక్క హీరోతో మాత్రం నటించలేదు.

అంతేకాదు ఆ హీరో చేసిన అన్యాయం వల్లే ఎప్పటికీ ఆ హీరో సినిమాలో నటించకూడదు అని నిర్ణయించుకుందట.మరి ఇంతకీ రంభకి అంత అన్యాయం చేసిన హీరో ఎవరు..ఏం చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. రంభ సినిమాల్లో నటించకూడదు అని అనుకున్న హీరో ఎవరో కాదు నాగార్జున.. అయితే బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి,మోహన్ బాబు వంటి ఆతరం హీరోలతో నటించినప్పటికీ నాగార్జునతో మాత్రం నటించలేదు.అయితే రంభకి నాగార్జునతో ఓ సినిమాలో చేసే అవకాశం వచ్చింది.

నాగార్జున,రమ్యకృష్ణ,మనిషా కొయిరాలా కలిసి నటించిన క్రిమినల్ అనే మూవీలో ముందుగా మనిషా కొయిరాల, రంభని హీరోయిన్స్ గా తీసుకుందాం అనుకున్నారట..అయితే ఈ విషయం తెలిసిన నాగార్జున రంభకు బదులు రమ్యకృష్ణని తీసుకుందాం అని చెప్పారట. అయితే అంత పెద్ద హీరో అడగడంతో కాదనలేని డైరెక్టర్ రంభని తీసేసి రమ్యకృష్ణని పెట్టుకున్నారట..దాంతో అప్పటి నుండి రంభ నాగార్జున పై కోపం పెంచుకుందట.

అంతేకాదు ఇక నాగార్జునకు సంబంధించిన ఏ సినిమాలో కూడా నటించకూడదని నిర్ణయించుకుందట.ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున మూవీలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం రంభకు వచ్చినప్పటికీ ఆ రోజు తనని తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నాడు అనే కోపంతో ఆ స్పెషల్ సాంగ్ కూడా చేయలేదట. అలా 90’s లో ఎంతోమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నాగార్జున ఈ ఒక్క హీరొయిన్ తో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news