Moviesఆ డైరెక్టర్ కి మహేష్ బాబుకి మధ్య చిచ్చు పెట్టిన నమ్రత..?

ఆ డైరెక్టర్ కి మహేష్ బాబుకి మధ్య చిచ్చు పెట్టిన నమ్రత..?

మహేష్ బాబుకి నిజంగానే ఆ డైరెక్టర్ తో గొడవలు ఉన్నాయా.. ఇద్దరి మధ్యన నమ్రత చిచ్చు పెట్టిందా..వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. మహేష్ బాబుకి ఆ డైరెక్టర్ కి మధ్య అంతగా సత్ససంబంధాలు లేవు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే.. అయితే మహేష్ బాబు ఈ రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే దానంతటకీ కారణం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పుకోవాలి.

ఎందుకంటే సరైన హిట్స్ లేని సమయంలో మహేష్ బాబుకి జీవితాన్ని ఇచ్చింది పూరి జగన్నాథ్. ఎందుకంటే ఈయన దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ బాబు లోని ఇంకో కోణాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. అలా పూరి జగన్నాథ్ మహేష్ ని ఇండస్ట్రీలో స్టార్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మాన్ మూవీ కూడా మహేష్ బాబుకి మంచి ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇలా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను పూరి జగన్నాథ్ తో చేసిన మహేష్ బాబుకి గొడవలు ఎక్కడివి అని అనుకుంటారు.

కానీ ఇది నిజమే. ఎందుకంటే మహేష్ బాబు మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎంతో మంది దర్శకులను పొగిడారు. వారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ తనకి లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాథ్ గురించి చెప్పకపోవడం గమనార్హం. అలాగే పూరి జగన్నాథ్ మొదట జనగణమన అనే మూవీని మహేష్ బాబుతోనే చేద్దామనుకున్నారట. కానీ ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు రావడం వల్లే ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో అనుకున్నట్టు తెలుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. మహేష్ బాబుతో ఎన్ని గొడవలు ఉన్నా కూడా జనగణమన సినిమాతో అన్ని మనస్పర్ధలు తొలగి పోతాయని ఓ రోజు పూరీ జగన్నాథ్ మహేష్ ఇంటికి వెళ్లారట. కానీ మహేష్ భార్య నమ్రత మాత్రం మహేష్ బాబుని కలవకుండానే ఆయన బిజీగా ఉన్నారు అని చెప్పి ఇంటి నుండి పంపించిందనే టాక్ ఆ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెగ వైరల్ అయింది. దాంతో మనస్పర్ధలు పోవడానికి పూరి జగన్నాథ్ కలవాలని ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ నమ్రత కారణంగానే వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగినట్టు చాలామంది టాలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు. అలా వీరిద్దరి మధ్య నమ్రత చిచ్చు పెట్టిందనే టాక్ అప్పట్లో చాలా వైరల్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news