Newsహీరోయిన్ ఎంగిలి తాగాలా.. డైరెక్టర్‌పై మహేష్ బాబు ఫైర్.. ఏం జరిగిందంటే.?

హీరోయిన్ ఎంగిలి తాగాలా.. డైరెక్టర్‌పై మహేష్ బాబు ఫైర్.. ఏం జరిగిందంటే.?

సినిమా అంటే ఎటువంటి సన్నివేశాలు డైరెక్టర్ చెప్పినా కచ్చితంగా చేయాల్సిందే. అవి లిప్ లాక్స్ అయినా సరే న్యూడ్ సన్నివేశాలు అయినా సరే డైరెక్టర్ మాటకు అడ్డు చెప్పకుండా అందులో నటించాల్సిందే. కానీ మహేష్ బాబు మాత్రం నేను ఆ హీరోయిన్ ఎంగిలి తాగాలా అంటూ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారట.మరి ఇంతకీ మహేష్ బాబు ని ఏ హీరోయిన్ ఎంగిలి తాగమని చెప్పారు. ఏ డైరెక్టర్ పై మహేష్ బాబు కోప్పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణించి మొదటిసారి హీరోగా పరిచయమైంది రాజకుమారుడు మూవీతో.

ఈ సినిమాలో ప్రీతిజింతా హీరోయిన్ గా చేసింది.ఇక ఈ సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అయితే అలాంటి ఈ సినిమా సమయంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయట. అంతేకాదు ఈసినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ పై మహేష్ బాబు కోపడ్డారట.అయితే ఈ సినిమాలో ఒకచోట ప్రీతిజింతా మహేష్ బాబులు ఒకే కూల్ డ్రింక్ లో స్ట్రా వేసుకుని తాగే సన్నివేశం ఉంటుంది.

అయితే ఈ సన్నివేశంలో మొదట ప్రీతి జింతా తాగాక తర్వాత మహేష్ బాబుని తాగమని చెప్పారట.అయితే ఆ సన్నివేశం ఎక్స్ప్లేన్ చేయడంతోనే డైరెక్టర్ రాఘవేంద్ర పై మహేష్ బాబు ఫైర్ అయ్యి ఏంటి మావయ్య ప్రీతిజింతా తాగాక నేను తాగాలా.. నేను ఈ సీన్ చేయను.. కావాలంటే నువ్వే చేసుకో అంటూ మహేష్ బాబు రాఘవేంద్రరావు పై కోప్పడి అక్కడి నుండి వెళ్లి పోయారట. అయితే మహేష్ బాబు కి రాఘవేంద్రరావుకి మధ్య మంచి అనుబంధం ఉండడంతో ఆయన మొదటి నుండి డైరెక్టర్ రాఘవేంద్ర రావు ని మావయ్య అని చాలా ఆప్యాయంగా పిలుస్తారట. అయితే ఈ సన్నివేశం గురించి మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో చెప్పి నవ్వుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news