Movies"ఆ విషయాన్ని లీక్ చేసి".. సుస్మితను అడ్డంగా బుక్ చేసిన నివేత...

“ఆ విషయాన్ని లీక్ చేసి”.. సుస్మితను అడ్డంగా బుక్ చేసిన నివేత పేతురాజు..!

నివేదా పేతురాజ్.. ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని వచ్చింది. స్టార్ హీరోయిన్ అవ్వలేదు . కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం సెటిల్ అయిందని చెప్పాలి. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా చేతికి వచ్చిన పాత్రలు అన్నీ కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా నటించిన “పరువు” వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పరువు వెబ్ సిరీస్ మొత్తం కూడా ఒక మర్డర్ మిస్టరీకి సంబంధించింది అన్న విషయం సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు .

ఈ సిరీస్లో నివేదా పేతురాజు క్యారెక్టర్ లీడ్..ఆ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి . కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నివేదా పేతురాజ్ ఒక వైరల్ వీడియో చేసింది . ఆ వీడియోలో… పోలీసులు ఆమె కారును అడ్డగిస్తారు… కారు చెక్ చేయాలని, డిక్కీ ఓపెన్ చేయాలని ఆమెను పోలీసులు కోరుతారు. అందుకు నివేద రిజెక్ట్ చేసి కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది. పరువుకు సంబంధించిన విషయం అని చెప్పి కారు డిక్కీ ఓపెన్ చేయడం కుదరని నానా హంగామ చేస్తుంది . అప్పటికీ పోలీసులు పట్టుబట్టడంతో వీడియో తీస్తున్న ఫోన్ విసిరేసి దురుసుగా ప్రవర్తించింది.

అయితే ఇదంతా తన సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే చేసింది. ఈ వీడియో నిజమని నమ్మిన పలువురు జనాలు ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేశారట. ఈ ప్రమోషనల్ వీడియో నివేద పేతురాజ్ కి చాలా చిక్కులే తెచ్చిపెట్టిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో పై ఆమె స్పందిస్తూ.. “పరువు ప్రమోషనల్ వీడియో ఇంత నెగిటివ్ గా వెళుతుందని నేను అస్సలు ఊహించలేదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుండి నాకు కాల్స్ వచ్చాయి. కొందరు బూతులు కూడా తిట్టారు.. అప్పుడే పరువు యూనిట్ సభ్యులకు కాల్ చేసి కనీసం టైటిల్ విడుదల చేయండి అని రిక్వెస్ట్ చేశాను… ఆ నెక్స్ట్ డే టైటిల్ రిలీజ్ చేశారు. దీంతో నాకు బుద్ధోచ్చింది. మరోసారి ఇలాంటి ప్రమోషనల్ వీడియో చేయకూడదని ఫిక్స్ అయ్యాను”అని నివేద పేతురాజ్ చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ నిర్మాత చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కావడం విశేషం. మరి ఈ ప్రమోషనల్ ప్లాన్ ఎవరిదో కానీ నివేద పేతురాజ్ విమర్శలపాలైంది. పరోక్షకంగా సుస్మిత చిక్కుల్లో ఇరుక్కుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news