Movies"నా కొడుకు చనిపోయాడు అని చెప్తే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఆ...

“నా కొడుకు చనిపోయాడు అని చెప్తే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఆ మాట అన్నారు”.. శిరీష్ భరద్వాజ్ తల్లి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మనకు తెలిసిందే.. మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యకాలంలో అనారోగ్య కారణంగా మరణించారు . మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే అతను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇంట్లో చెప్పకుండా గుడిలో వెళ్లి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది . ఆ తర్వాత వీళ్లమధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

అప్పట్నుంచి శిరీష్ భరద్వాజ్ కు దూరంగా అంటే ఉంటూ వచ్చింది శ్రీజ. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకుంది . ఆయన కి కూడా విడాకులు ఇచ్చేసింది. అయితే శిరీష్ భరద్వాజ్ రీసెంట్గా లంగ్స్ ప్రాబ్లం కారణంగా మరణించారు . ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తల్లి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో శిరీష్ భరద్వాజ్ తల్లి మాట్లాడుతూ..” శ్రీజ శిరీష్ భరద్వాజ్ నిజంగానే ప్రేమించుకున్నారు.. శ్రీజ చాలా మంచి అమ్మాయి ..నివృత్తి అచ్చం నా కొడుకులానే ఉండడం నాకు చాలా చాలా ఆనందం.. ఆ పాపను చూసినప్పుడల్లా నా కొడుకే గుర్తొస్తాడు.. మే 13న భరద్వాజ్ పుట్టినరోజు ఉంది సెలబ్రేషన్స్ కోసమే దుబాయ్ వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం ..దీంతో అపోలో హాస్పిటల్ లో చేర్పించాము.. 30 రోజుల తర్వాత ట్రీట్ మెంట్ తీసుకుంటూ కార్డియాక్ అరెస్ట్ వల్ల జూన్ 19న మరణించాడు . శిరీష్ భరద్వాజ్ మరణించిన విషయాన్ని మెగా కుటుంబానికి చెప్పాను . కానీ వారిలో ఎవరు కూడా అంతక్రియలకు రాలేదు. రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి .. నా వరకు నా మనవరాలు నివృత్తిని చూడాలని ఉంది.. పెద్దవాళ్ళు కదా వాళ్ళ ఇష్టం అవకాశం కల్పిస్తారో లేదో అంటూ చెప్పుకొచ్చింది”..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news