Movies' టెంప‌ర్ ' షూటింగ్ టైంలో ఇంత పెద్ద డిస్ట‌బెన్స్ జ‌రిగిందా......

‘ టెంప‌ర్ ‘ షూటింగ్ టైంలో ఇంత పెద్ద డిస్ట‌బెన్స్ జ‌రిగిందా… తార‌క్‌ కోపం న‌షాళానికి ఎక్కేసిందా..?

టాలీవుడ్‌లో న‌లుగురు స్టార్స్ కలిసి చేసిన సినిమా టెంపర్. పూరి జగన్నాధ్ స్టార్ డైరెక్టర్, బండ్ల గణేశ్ స్టార్ ప్రొడ్యూసర్, ఎన్టీఆర్ స్టార్ హీరో, వక్కంతం వంశీ స్టార్ రైటర్…. వీరు న‌లుగురు నుంచి వచ్చిందే టెంపర్. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు. ఎప్పుడో ఢిల్లిలో జరిగిన నిర్భయ హత్యని ఆధారంగా చేసుకొని రైట‌ర్ వంశీ అద్భుతమైన కథ రాసుకున్నారు.

వంశీకి ఎన్టీఆర్‌కు మంచి ర్యాపో ఉంది. అలా టెంప‌ర్ క‌థ‌ను తార‌క్‌కు చెప్పాడు. ఎందుకో అది హోల్డ్ లో ప‌డింది. అదే టైంలో ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ కాంబోలో బడ్ల గణేశ్ సినిమా నిర్మించాలని అనుకున్నారు. కానీ, కథ లేదు. పూరి త‌న సినిమాల‌న్నింటికి తానే క‌థ రాసుకుంటాడ‌నే విష‌యం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. టెంపర్ కథ పూరికి చెప్పమని వక్కంతం వంశీతో చెప్పారు.

వంశీ ఆ క‌థ పూరికి చెప్పగా పూరికి విపరీతంగా నచ్చింది. అలా టెంప‌ర్ సినిమా 2015లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. కానీ స్టోరీ రైట‌ర్ వక్కంతం వంశీకి మాత్రం బండ్ల గణేశ్ మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇవ్వక‌పోగా.. త‌ర్వాత చాలా రోజుల‌కు ఓ చెక్ ఇచ్చారట. అది కాస్తా బౌన్స్ అయింది. చివ‌ర‌కు వంశీ త‌న రెమ్యున‌రేష‌న్ కోసం తప్పని పరిస్థితుల్లో బండ్ల గణేశ్ మీద చెక్ బౌన్స్ కేసు వేయాల్సి వచ్చింది.

అప్పట్లో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో బాగా వైరల్ అయింది. ఈ కేసు వ‌ల్ల‌ కాస్త డిస్టబెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఇక బండ్ల గ‌ణేష్ చేసిన కొన్ని ప‌నుల‌కు షూటింగ్ టైంలో కూడా ఎన్టీఆర్‌.. బండ్ల‌పై కాస్త చికాకు ప‌డ్డాడ‌న్న గుస‌గుస‌లు కూడా అప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news