Moviesరాజ్‌త‌రుణ్ - లావ‌ణ్య కేసులో అర్ధ‌రాత్రి హైడ్రామా.. సినిమాను త‌ల‌పించిన ట్విస్టులు..!

రాజ్‌త‌రుణ్ – లావ‌ణ్య కేసులో అర్ధ‌రాత్రి హైడ్రామా.. సినిమాను త‌ల‌పించిన ట్విస్టులు..!

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నటుడు రాజ్ తరుణ్, అతని ప్రేయసి లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ పెను సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే లావ‌ణ్య అందించిన ఆధారాల‌తో రాజ్ త‌రుణ్ పై నార్సింగి పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఏ1గా రాజ్ త‌రుణ్‌, ఏ2గా హీరోయిన్ మాల్వి మ‌ల్హాత్రా, ఏ3గా మాల్వి సోద‌రుడు మ‌యాంక్ పేర్ల‌ను చేర్చి విచార‌ణ చేప‌ట్టారు. మ‌రోవైపు లావ‌ణ్య‌కు అండంగా ప్ర‌ముఖ సుప్రీంకోర్టు న్యాయ‌వాది క‌ళ్యాణ్ దిలీప్ సుంక‌ర అండంగా నిల‌బ‌డ‌టంతో వ్య‌వ‌హారం మ‌రింత హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా రాజ్ త‌రుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా లావణ్య ఆత్మహత్యకు సిద్ధపడింది. శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లావ‌ణ్య తన అడ్వకేట్‌కు మెసేజ్ పంప‌డం క‌ల‌క‌లం రేపింది. `రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్వీ మల్హోత్రాను బ్రతిమిలాడాను. కానీ తను వినిపించుకోలేదు.

నేను ఎంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ.. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వీ మలోత్రానే. రాజ్ తరుణ్ మాల్వీ మోజులో పడి మారిపోయాడు. నా మరణాన్ని కోరుకుంటున్నాడు.` అంటూ లావ‌ణ్య త‌న అడ్వ‌కేట్ కు సోసైడ్ నోట్ పంపింది.

అయితే వెంట‌నే స్పందించిన అడ్వ‌కేట్ డయల్‌ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెను ర‌క్షించారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌కుండా కౌన్సింగ్ ఇచ్చారు. దీంతో ఈ అర్ధరాత్రి హైడ్రామా మొత్తం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news