Moviesడ‌ల్లాస్‌లో టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ వీఎన్‌. ఆదిత్య కొత్త సినిమా ఆడిష‌న్స్‌... కేక...

డ‌ల్లాస్‌లో టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ వీఎన్‌. ఆదిత్య కొత్త సినిమా ఆడిష‌న్స్‌… కేక పెట్టించే రెస్పాన్స్‌..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది.. దర్శకులు ఉన్నప్పటికీ విఎన్ ఆదిత్య గురించి… ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి బంపర్ హిట్ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు ఆదిత్య. ఇక ఆదిత్య దర్శకత్వంలో ఒక్క సినిమా వచ్చిందంటే.. ఆ సినిమా బంపర్ హిట్ కావాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్కు రప్పించేలా ఉంటాయి ఆయన సినిమాలు.

అయితే ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన విఎన్ ఆదిత్య… తాజాగా మరో కొత్త ప్రాజెక్టుతో రాబోతున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొత్త అప్డేట్.. ఆదిత్య సినిమాల గురించి వచ్చింది. ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుందట. ఓ ఎం జి ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో…ఈ సినిమా రాబోతుందట.

ఇక దీనికి దర్శకత్వం… విఎన్ ఆదిత్య కాగా, డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే జులై ఏడవ తేదీన అమెరికాలో ఉన్నటువంటి డల్లాస్ నగరంలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త సినిమా… నిర్మాణం డల్లాస్ లో జరగనుంది. అంతేకాదు షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని… చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమా కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఇక ఈ కార్యక్రమంలో ప్రవాస ఇండియన్స్ పాల్గొన్నారు. అటు విదేశీయులు కూడా చాలా మంది వచ్చారు. కాగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా వస్తున్న తరుణంలో… ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సినిమా చేశారంటే కచ్చితంగా హిట్ అవుతుందని… ఫీల్ గుడ్ మూవీస్ కుకేరాఫ్ అడ్రస్ ఆదిత్య అని కొనియాడుతున్నారు ప్రేక్షకులు. ఇన్ని అంచనాల మధ్య ఆదిత్య ఎలాంటి కథను తీసుకువస్తారో చూడాలి.

అలాగే పై కార్య‌క్ర‌మం ఇంత స‌క్సెస్ కావ‌డానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్‌కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్ల‌కు, శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్‌చార్జ్ మమత కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండికి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news