Moviesఅల్లు అర్జున్-న‌య‌న‌తార మ‌ధ్య గొడ‌వేంటి.. ఇద్ద‌రికీ ఎక్క‌డ చెడింది..?

అల్లు అర్జున్-న‌య‌న‌తార మ‌ధ్య గొడ‌వేంటి.. ఇద్ద‌రికీ ఎక్క‌డ చెడింది..?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అల్లు అర్జున్ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే త‌న సుధీర్గ సినీ ప్ర‌యాణంలో కొన్ని వివాదాల వ‌ల్ల కూడా అల్లు అర్జున్ హెడ్ లైన్స్ లో నిలిచాయి. అయితే బాగా హైలెట్ అయిన వాటిల్లో నయనతార ఇష్యూ ఒకటి. అసలు అల్లు అర్జున్ నయనతార మధ్య గొడవేంటి..? వీరిద్దరికి ఎక్కడ చెడింది..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2016 నుంచి అల్లు అర్జున్, న‌య‌న‌తార మ‌ధ్య దూరం పెరిగింది. ఇందుకు కార‌ణం ఓ అవార్డు ఫంక్ష‌న్ లో అల్లు అర్జున్ ను న‌య‌న‌తార ఘోరంగా అవ‌మానించ‌డ‌మే. అస‌లేం జ‌రిగిందంటే.. న‌య‌న‌తార త‌న భ‌ర్త విఘ్నేష్ శివన్ ద‌ర్శ‌క‌త్వంలో నానుమ్ రౌడీ ధాన్ మూవీలో యాక్ట్ చేసింది. ఇదొక రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం. విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేశాడు.

హీరో ధ‌నుష్ త‌న వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. 2013లో రిలీజ్ అయిన నానుమ్ రౌడీ ధాన్ చిత్రం కమర్షియల్ గా హిట్ కాక‌పోయినా ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఉత్త‌మ న‌టిగా న‌య‌న‌తార ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అయితే అవార్డు ఫంక్ష‌న్ లో న‌య‌న‌తార‌కు అవార్డు ప్ర‌జంట్ చేయ‌డానికి అల్లు అర్జున్ ను స్టేజ్ పైకి పిలిచారు. కానీ అల్లు అర్జున్ చేతుల మీద‌గా అవార్డు తీసుకునేందుకు న‌య‌న‌తార అంగీక‌రించ‌లేదు.

మీరు ఏమీ అనుకోక‌పోతే నేను ఈ అవార్డును నానుమ్ రౌడీదాన్ సినిమా డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకుంటాన‌ని చెప్పి న‌య‌న‌తార అంద‌రి ముందు అల్లు అర్జున్ ను అత్యంత దారుణంగా అవ‌మానించింది. అప్ప‌ట్లో ఈ మ్యాట‌ర్ పెద్ద కాంట్ర‌వ‌ర్సీ అయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ న‌య‌న‌తార‌పై నిప్పులు చెరిగారు. అవార్డు ఇవ్వ‌డానికి వ‌చ్చిన త‌ర్వాత అల్లు అర్జున్ ను అలా అవ‌మానించ‌డం క‌రెక్ట్ కాద‌ని సినీ ప్ర‌ముఖులు కూడా చెవులు కురుక్కున్నారు. న‌య‌న‌తార తీరును త‌ప్పుబ‌ట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news