Movies"అల్లు అర్జున్ గాడికి ఆ పిచ్చి ఎక్కువ"..స్టార్ డైరెక్టర్ అన్ బిలీవబుల్...

“అల్లు అర్జున్ గాడికి ఆ పిచ్చి ఎక్కువ”..స్టార్ డైరెక్టర్ అన్ బిలీవబుల్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుపై ఎలాంటి నెగిటివ్ ప్రచారం జరిగిందో అందరికీ తెలిసిందే. మెగా ఫాన్స్ అయితే ఓ రేంజ్ లో ఏకిపారేశారు. నిన్న మొన్నటి వరకు మెగా హీరో అంటూ డప్పు కొట్టిన జనాలే మెగా ఫ్యామిలీకి బిగ్ బద్ధ శత్రువు ..అల్లు అర్జున్ అంటూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు . ఎంతలా అంటే పుష్ప2 సినిమాను ఆగస్టు 15వ తేదీ నుంచి ఏకంగా డిసెంబర్ 6 వాయిదా వేసేలా చేశారు మెగా ఫాన్స్ దినంతటికీ కారణం పాలిటిక్స్ అన్న విషయం తెలిసిందే . నంద్యాల ప్రచారంతో అల్లు అర్జున్ కెరియర్ మలుపు తిరిగింది .

మరి ముఖ్యంగా నాగబాబు పరాయి వాడు అంటూ ట్విట్ చేయడం కూడా మెగా ఫాన్స్ కు బూస్ట్ అప్ ఇచ్చింది. సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేయడం స్నేహారెడ్డిని కూడా అన్ ఫాలో చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది . అయితే రీసెంట్ గా డైరెక్టర్ గీతాకృష్ణ అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. “అల్లు అర్జున్కి పబ్లిసిటీ పిచ్చి ..దానికోసం ఏమైనా చేస్తాడు ..ఆ పబ్లిసిటీ కోసమే బాగా ఖర్చు పెడుతూ ఉంటాడు . సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని పొగిడేస్తే ఆయనకు విపరీతమైన ఆనందం అందుకోసమే పోస్ట్ పెడుతూ ఉంటారు .. ఎక్కడో ఒక కార్యక్రమంలో అన్నాడు కదా నా దగ్గర ఒక ఆర్మీ ఉంది అని ..ఆ ఆర్మీ ఇదే ..సినిమా రిలీజ్ కాగానే ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద కోటి రూపాయలు ఖర్చు పెడితే దానికి మంచి పబ్లిసిటీ వచ్చేస్తది..

అలా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ గురించే భజన చేస్తూ ఉంటారు …డబ్బు లేకుండా పవన్ కళ్యాణ్ చూడడానికి ఎంత మంది వస్తారో అందులో సగం మందైన అల్లు అర్జున్ చూడడానికి వస్తారు ..పుష్ప హిట్ అయ్యి నేషనల్ అవార్డు గెలిచాడు .. కాబట్టి అల్లు అర్జున్ చూడడానికి చాలామంది వస్తారు ..ఆ విషయం తెలుసు దానికోసమే ప్రచారాల్లోకి వెళ్ళాడు .. ఆయన టైం బ్యాడ్ సినిమాల పరంగా ఆయన ఫుల్ నెగిటివ్గా మారిపోయాడు ..నార్త్ లో ఈ మార్కెట్ బాగా ఉపయోగపడుచు గాని సౌత్ లో ఆయనకి కెరియర్ ఉంటుంది అని అనుకోవడం లేదు “అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ చెప్పుకొని రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news