Moviesఆ ఒక్క విష‌యం తెలిశాక ల‌య‌తో పెళ్లే వ‌ద్ద‌ని ఫిక్సైన టాలీవుడ్...

ఆ ఒక్క విష‌యం తెలిశాక ల‌య‌తో పెళ్లే వ‌ద్ద‌ని ఫిక్సైన టాలీవుడ్ హీరో..?

టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు.. కుర్ర హీరోలు వచ్చి.. పాన్ ఇండియా రేంజ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే ఒకప్పటి కుర్ర హీరోలు అంటే జనాలకు చాలా ఇష్టం. వాళ్ళు నటించింది కొన్ని సినిమాలలో అయినా.. జనాల మనసుల్లో తమ సినిమాలతో ఎప్పటికీ అలా పాతుకుపోయారు. అలాంటి వారిలో దివంగత ఉదయ్‌కిరణ్, తరుణ్, సాయికిరణ్, వేణు, రోహిత్ లాంటి నటులు ఉంటారు. సాయికిరణ్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించినా నువ్వే కావాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ప్రేమించు సినిమాతో సోలోగా మంచి విజయం అందుకున్నాడు.

ప్రస్తుతం సాయికిరణ్ బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక సాయికిరణ్‌కు ప్రేమించు సినిమాలో జంటగా అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా పేరున్న‌ లయ నటించగా.. వీరిమ‌ధ్య ప్రేమాయణం నడిచింది అన్న పుకార్లు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం సాయికిరణ్ ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్టు లయ‌కు నాకు మధ్య ప్రేమ, దోమ లాంటివి ఏమీ లేవని.. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపాడు. అయితే మా జంట చూడటానికి బాగుంటుందని మా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు.. పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుందని వాళ్లే ప్రపోజల్ తీసుకొచ్చారని సాయికిరణ్ తెలిపాడు.

అయితే తన ఫ్యామిలీ వాళ్ళు జాతకాల బాగా నమ్ముతారని.. లయా, నా జాతకం చూపిస్తే జాతకాలు కలవకపోవడంతో మా ఇద్దరి పెళ్లి ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పాడు. ఇక జాతకాలు కలవలేదు అని క్లారిటీ రావడంతో.. లయ నేను కూడా పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిపోయాం.. తర్వాత కూడా మంచి స్నేహితులుగా ఉన్నామని సాయికిరణ్ తెలిపాడు. ఆ తర్వాత కూడా ఇంద్రజిత్ అనే షో చేశామని.. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ.. ఎంతో బాగుంది సినిమాలో కూడా జంటగా నటించాం. అంతేగాని మా మధ్య ప్రేమ దోమలు ఏమీ లేవు. ఇప్పుడు ఇద్దరం పర్సనల్ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నాం అని సాయికిరణ్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news