Movies"మేము ఏం ఆ రికార్డుల కోసం సినిమా తీయలేదు".. 'కల్కి' నిర్మాత...

“మేము ఏం ఆ రికార్డుల కోసం సినిమా తీయలేదు”.. ‘కల్కి’ నిర్మాత షాకింగ్ పోస్ట్ వైరల్..!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా పేరే మారు మ్రోగిపోతుంది. చాలా చాలా రియలిస్టిక్ గా నాగ్ అశ్వీన్ ఈ సినిమాని తెరకెక్కించడం గమనార్హం. అంతేకాదు మహాభారతంలోనికి ఎలిమెంట్స్ ను కలియుగ అంతానికి ముడిపెడుతూ నాగ్ అశ్వీన్ చూపించిన ప్రపంచం అద్భుతంగా ఉంది అంటూ పలువురు స్టార్స్ కూడా పొగిడేస్తున్నారు. అంతేనా ఏకంగా రిలీజ్ అయిన మొదటి రోజే 180 కోట్లకు పైగా వసూలు క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్ నెలకొల్పింది.

ప్రభాస్ కెరియర్ లో కూడా పలు కీలక మైల్ స్టోన్స్ క్రాస్ చేసింది . కల్కి కలెక్షన్స్ అధికారికంగా మూవీ యూనిట్ పోస్ట్ చేయలేదు. దీంతో జనాలకు కొత్త డౌట్లు మొదలయ్యాయి . అయితే దీనిపై నిర్మాత స్వప్న స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది . స్వప్న పోస్టులో రాసుకోస్తూ..” నాకు కూడా ఆశ్చర్యంకరంగా ఉంది ..చాలామంది కాల్ చేసి మరీ అడుగుతున్నారు.. రికార్డ్స్ క్రాస్ చేసామా..? లేదా..?”..

“రికార్డ్స్ క్రియేట్ చేసామా..? లేదా..? అని అలాంటివి చదివినప్పుడు విన్నప్పుడు నవ్వొస్తుంది .. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళు ఎవరు కూడా అలాంటి రికార్డుల కోసం సినిమాలు తీయరు.. సినిమాను తెరకె క్కించారు.. సినిమాల్లో నటించరు .. ప్రేక్షకుల కోసం సినిమా మీద ప్రేమతోనే సినిమాలు తీస్తారు.. మేము కూడా అలాగే తీసాం “అంటూ పోస్ట్ చేసింది. దీంతో స్వప్న దత్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది
. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రియాంక దత్ – స్వప్న దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది . మొదటి రోజే 180 కోట్లు వసూలు చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news