Movies"కల్కి" సినిమా ట్రైలర్ లో మీరు ఇది గమనించారా..ఈ నాగ్ అశ్విన్...

“కల్కి” సినిమా ట్రైలర్ లో మీరు ఇది గమనించారా..ఈ నాగ్ అశ్విన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడా..? క్లారిటీ ఇస్తున్నాడా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . ఎంతలా అంటే ఈ సినిమాలోని ట్రైలర్ కి సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు . ఈ క్రమంలోనే అసలు ఈ కల్కి ఎవరు..? ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తే మరి కల్కి పాత్రలో ఎవరిని చూపించబోతున్నారు..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్లో కొన్ని క్రేజీ క్రేజీ హింట్స్ వదిలాడు నాగ్వ్ అశ్వీన్ .

అయితే ఇవి హింట్స్ నా.. లేకపోతే కన్ఫ్యూషన్ చేస్తున్నాడా ..?అనే విషయాలు మాత్రం అర్థం కావడం లేదు. మీరు బాగా గమనించినట్లయితే కల్కి సినిమా కాన్సెప్ట్ మొత్తం మహాభారతంలోని కురుక్షేత్రం తరహాలో ఉంటుంది . మంచి కోసం కురుక్షేత్రం జరిగితే కలియుగంలో ఎలా మారబోతుంది..? అనేది సినిమా కాన్సెప్ట్. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం భూమి మీద ఉన్న అన్ని వనరులు అయిపోతే ఆ తర్వాత పాపాలు విపరీతంగా పెరిగిపోతే మహావిష్ణువు చెప్పిన దాని ప్రకారం కల్కి గా అవతరించాలి . అయితే ట్రైలర్లో మనకు దీపికా పదుకొనే కడుపులో ఉన్న బిడ్డ రూపంలో కల్కి జన్మించబోతున్నట్లు చూపిస్తారు .

అంతవరకు బాగానే ఉంది మరి ప్రభాస్ భైరవ క్యారెక్టర్ లో నటిస్తున్నారు కదా సినిమాకి హీరోగా ఈయన నిలుస్తాడా ..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు ఇంకొక డౌట్ ఏంటంటే అశ్వద్ధామ సుమతిని కాపాడేందుకు బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు .. అయితే భైరవ సుమతిని పట్టుకునేందుకు ట్రై చేస్తూ ఉంటాడు . ఈ క్రమంలో భారీ ఫైట్ కూడా జరుగుతుంది. అప్పుడు అశ్వద్ధామని ఒక్క గుద్దు గుద్దితే అంత దూరంలో పడిపోతాడు అప్పుడే ఆ డబ్బ రుచి కి అశ్వద్ధామకి కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు వస్తుంది .. అంటే ఆ కురుక్షేత్రంలో అశ్వద్ధామను ఎవరో కొట్టినట్లు అన్న విషయం క్లారిటీ వచ్చింది.

ఆ దెబ్బకి అశ్వద్ధామ దూరంగా పోయి పడిపోతాడు . అంతేనా ఆ ఫోర్స్ కి ఏనుగులు కూడా కదిలిపోతాయి . అయితే అశ్వద్ధామను కొట్టిన వ్యక్తి మళ్ళీ బైరవ రూపంలో పుట్టాడా..? కురుక్షేత్రంలో అశ్వద్ధామను కొట్టింది ఎవరు? కృష్ణుడా..? అర్జునుడా..? భీముడా ..? మహాభారతంలో అశ్వద్ధామతో యుద్ధం చేసింది ఎవరు ..? అనే విషయాలు లోతుగా పరిశీలించాల్సి వస్తుంది . అయితే భైరవ సాధారణ మానవుడు ..ఆయనను కల్కిగా చూపించే విధానంలో నాగ్ అశ్వీన్ ఎక్కడో తడబడ్డాడు అని అనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ ని కల్ కి గా చూపిస్తే సుమతి రోల్ లో నటిస్తున్న దీపికా పదుకొనే గర్భంలో ఉన్నది ఎవరు? ఈ విషయాలన్నీ ఫుల్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. కావాలనే ఈ విధంగా నాగ్ అశ్వీన్ క్రియేట్ చేశాడా ..? లేకపోతే ఇదంతా సినిమాలో భాగంగా వచ్చే సస్పెన్స్ నా..? తెలియాలి అంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news