తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ .. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటూ తమ లైఫ్ని నాశనం చేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా డబ్బున్న పిల్లలు బడా స్టార్ సెలబ్రిటీస్ ఇలా డివోర్స్ తీసుకుంటూ ఉండడం గమనార్హం . ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ ప్రముఖులు విడాకులు తీసుకుని తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరొక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకుంది .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2024/05/2dce480b-f562-49b7-b93d-762f312144bc.jpeg)
ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . కారణాలు ఏవైనప్పటికీ సినీ పరిశ్రమలో ఇలా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఆయన భార్య గాయని సైంధవి తమ పదకండేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. వీళ్ళు విడాకులు తీసుకున్నారు . సోషల్ మీడియాలో వీళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న సరే ..అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో జనాలు అదంతా ఫేక్ అనుకున్నారు.
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2024/05/gvp1305241-171560040838316_9.webp)
అయితే చివరికి అఫీషియల్ గా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు . “ఎంతో ఆలోచించి చివరికి విడిపోవాలి అని డిసైడ్ అయ్యాం. నేను సైంధవి నిర్ణయించుకున్న డెసిషన్ మీకు చెబుతున్నాము.. మేము పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము.. దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి.. మీడియా స్నేహితులు .. అభిమానులు మా నిర్ణయాన్ని గౌరవించండి .. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మంచిదే..అందుకే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం” అంటూ జీవి ప్రకాష్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త తమిళనాట సంచలనం రేపుతుంది. ఆస్కార్ గ్రహిత ఏఆర్ రెహమాన్ మేనల్లుడే ఈ జీవి ప్రకాష్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఓ మంచి గుర్తుంపును తెచ్చుకున్నాడు. సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు.