Movies"కడుపు రగిలిపోతుంది"..వాళ్లపై పోలీసు కేసు..అనుష్క శెట్టి సంచలన నిర్ణయం.. ఏమైందంటే..?

“కడుపు రగిలిపోతుంది”..వాళ్లపై పోలీసు కేసు..అనుష్క శెట్టి సంచలన నిర్ణయం.. ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ ఏ రేంజ్ లో స్టార్ట్ అయిందో మనం చూస్తున్నాం. స్టార్ సెలబ్రిటీ కాదు చిన్న సెలబ్రిటీ కాదు ఎలాంటి వాళ్ళనైనా సరే హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ప్రభాస్ హీరోయిన్ అనుష్క శెట్టిలకు పెళ్లి చేస్తూ కొన్ని పిక్చర్స్ రిలీజ్ చేశారు ఫ్యాన్స్ . అదేవిధంగా మీమర్‌స్, ట్రోలర్స్ కూడా ఆ పిక్చర్స్ ను మరింత స్థాయిలో ట్రోల్ చేశారు.

కొంతమంది ఏకంగా వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టినట్లు పాపను – బాబును కూడా ఇమేజెస్ మార్ఫ్ చేశారు . అయితే ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన అనుష్క శెట్టి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ పై ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ తో పెళ్లి అంటూ ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన జనాలు .. ఇప్పుడు ఒక బడా క్రికెటర్ తో ఆమె పెళ్లి జరగబోతుంది అని ఏకంగా ఆయనతో క్లోజ్ గా ఉన్నట్లు కొన్ని ఫొటోస్ ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు .

దీనిపై హర్ట్ అయిన అనుష్క శెట్టి ఫ్యామిలీ ఆ ఫొటోస్ చూసి కడుపు రగిలిపోతుందని .. ఇలా ఎంతమందితో తన కూతురు పెళ్లి చేస్తారు అని అనుష్క శెట్టి పేరెంట్స్ బాధపడిపోతున్నారట . అంతేకాదు అలాంటి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అని తన కూతురు పర్సనల్ లైఫ్ పై ట్రోల్ చేసే వాళ్ళ పై పోలీసు కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news